News March 1, 2025

‘అందుకొనేంత దూరంలో అభివృద్ధి చెందిన దేశం’

image

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం అందుకొనేంత దూరంలోనే ఉందని 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగడియా అన్నారు. ఇందుకు కొన్ని సంస్కరణలు అవసరమని సూచించారు. ‘ప్రస్తుత ధరల వద్ద డాలర్‌ ప్రాతిపదికన 2003-24 వరకు భారత్ 10.1% వృద్ధిరేటు సాధించింది. మరో పదేళ్లు ఇదే రేటు కొనసాగిస్తే దేశం $9.5T ఎకానమీ అవుతుంది. 2047 నాటికి తలసరి ఆదాయం $14000 కావాలంటే 7.3% గ్రోత్ అవసరం’ అని వివరించారు.

Similar News

News March 1, 2025

గర్భిణులు, వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దు: APSDMA

image

APలో 3 నెలలపాటు ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని <>APSDMA<<>> వెల్లడించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటికెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి, లెమన్ వాటర్ తాగాలని సూచించింది. ఎండలపై సమాచారం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలంది.

News March 1, 2025

యూట్యూబ్ రూమర్లను నా భార్యకు పంపుతున్నారు: అనిల్ రావిపూడి

image

యూట్యూబ్‌లో వ్యూస్ కోసం రూమర్లు క్రియేట్ చేసే వారిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు. మీనాక్షి చౌదరితో తనకు కెమిస్ట్రీ బాగుంటుందని యూట్యూబ్‌లో ఈ మధ్య రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. ఆ రోతను సన్నిహితులు తన భార్యకు పంపి ఇదేంటని అడుగుతున్నట్లు చెప్పారు. లేనివి సృష్టించి తాత్కాలికంగా లాభపడ్డా, అవి జీవితాలను ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలన్నారు.

News March 1, 2025

ఏటికొప్పాక బొమ్మలకు అరుదైన గౌరవం

image

AP: అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మలకు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఆ బొమ్మల స్టాల్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం శరత్ అనే కళాకారుడిని ఎంపిక చేసింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మల శకటం ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!