News August 28, 2024
రైల్వే హెడ్గా తొలిసారి దళితుడు

119 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల రైల్వేకు తొలిసారి ఓ దళితుడు అధిపతిగా ఎంపికయ్యారు. 1986 బ్యాచ్ రైల్వే మెకానికల్ ఇంజినీర్ సతీశ్ కుమార్ రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. సెప్టెంబర్ 1న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పీఎం మోదీ నేతృత్వంలోని నియామకాల క్యాబినెట్ కమిటీ ఆయన ఎంపికను ఆమోదించింది. దేశ రాజకీయాలను దళితులు, కోటా ఉద్యమాలు కుదిపేస్తున్న వేళ సతీశ్కు కీలక పదవి రావడం గమనార్హం.
Similar News
News November 6, 2025
వేదాల్లో ఏముంటాయి? వాటినెందుకు చదవాలి?

సంతోషం కోసం వేదాలు చదవాలి. ఇందులో ప్రధానంగా 4 విషయాలు ఉన్నాయి.
1. ఐహిక సుఖాలను, ఆనందాలను పొందేందుకు ఉపాయాలు.
2. దేవతల అనుగ్రహం కోసం పాటించవలసిన వివిధ ఉపాసనలు, పద్ధతులు.
3. జీవిత అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని సాధించడానికి మార్గదర్శకమైన వచనాలు.
4. నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలకు మూలాలైన అనేక ప్రాథమిక సూత్రాలు. <<-se>>#VedikVibes<<>>
News November 6, 2025
నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన!

నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోందని APSDMA పేర్కొంది. ఇవాళ కృష్ణా, ప్రకాశం, NLR, ATP, కడప, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఉ.8.30 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, నారాయణ్పేట్, నల్గొండ, నిజామాబాద్, వనపర్తి, గద్వాల, RR, HYD, మల్కాజ్గిరి, వికారాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్సుందని HYD IMD తెలిపింది.
News November 6, 2025
జ్ఞానాన్ని ప్రసాదించే వ్యాస మంత్రం

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||3||
వసిష్ఠుడికి మునిమనవడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరుడికి పుత్రుడు, పరమ పవిత్రుడు, గొప్ప తపస్సు సంపద కలిగినవాడు, శుకమహర్షి తండ్రి అయిన ఆ వేదవ్యాస మహర్షికి మనం నమస్కరించాలి. ఆ వ్యాసుడి గొప్ప వంశాన్ని, పవిత్రతను స్మరించుకొని, పూజించడం వలన ఆయనలా జ్ఞానం లభిస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


