News April 28, 2024
చనిపోయిన అభ్యర్థిని ఓటేసి గెలిపించారు!

మరణించిన ఓ అభ్యర్థికి ఓటేసి గెలిపించిన విషయం తెలుసా? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆళ్లగడ్డ YCP అభ్యర్థి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రిటర్నింగ్ అధికారి యథావిధిగా ఎన్నికలు నిర్వహించగా.. అప్పటికే 4సార్లు MLAగా చేసిన శోభకు ప్రజలు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. అభ్యర్థి మరణిస్తే ఎన్నికల నిర్వహణ రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
<<-se>>#ELECTIONS<<>>
Similar News
News November 18, 2025
అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.
News November 18, 2025
అమెరికాతో త్వరలోనే ట్రేడ్ డీల్!

ఇండియా, అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలోనే ఖరారు కానుందని తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘BTAపై అమెరికాతో చర్చిస్తున్నాం. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకదానికి సమయం పడుతుంది. రెండోది రెసిప్రోకల్ టారిఫ్స్ను పరిష్కరించే ప్యాకేజీ. దీని విషయంలో డీల్కు దగ్గరగా ఉన్నాం’ అని వెల్లడించాయి.
News November 18, 2025
ఇవాళ భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు APSDMA తెలిపింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది. మరోవైపు ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.


