News April 28, 2024

చనిపోయిన అభ్యర్థిని ఓటేసి గెలిపించారు!

image

మరణించిన ఓ అభ్యర్థికి ఓటేసి గెలిపించిన విషయం తెలుసా? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆళ్లగడ్డ YCP అభ్యర్థి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రిటర్నింగ్ అధికారి యథావిధిగా ఎన్నికలు నిర్వహించగా.. అప్పటికే 4సార్లు MLAగా చేసిన శోభకు ప్రజలు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. అభ్యర్థి మరణిస్తే ఎన్నికల నిర్వహణ రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
<<-se>>#ELECTIONS<<>>

Similar News

News November 27, 2025

భారత్ వైట్ వాష్.. తప్పెవరిది?

image

SAతో 2 టెస్టుల్లోనూ ఘోరంగా ఓడిపోవడాన్ని భారత ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటర్ల డిఫెన్స్ టెక్నిక్ పేలవంగా ఉందని, T20 ఫార్మాట్ అలవాటై గంటల కొద్దీ బ్యాటింగ్ చేసే ఓపిక నశించిందని అంటున్నారు. అటు ఎక్కువశాతం కోచ్ గంభీర్‌పై ఫైర్ అవుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు, టీం సెలక్షన్ సరిగా చేయలేకపోతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇంతకీ వైట్ వాష్‌కి కారణం ప్లేయర్లా, కోచ్ గంభీరా? కామెంట్ చేయండి.

News November 27, 2025

ఆవు పేడతో అలుకుత ఎందుకు చల్లాలి?

image

పూజలు, శుభకార్యాల సమయంలో ఆవు పేడతో అలుకుత చల్లే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి ఆవు పేడ ఒక అద్భుతమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. కీటకాలను దూరం చేసే సహజ సిద్ధమైన పరిష్కారంగా దీన్ని భావిస్తారు. అప్పట్లో రసాయన క్రిమిసంహారకాలు ఉండేవి కాదు. అందుకే ఆ రోజుల్లో నేలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, సానుకూల శక్తిని నింపడానికి ఈ పద్ధతిని ఆచరించేవారు.

News November 27, 2025

నేటి నుంచి వైకుంఠద్వార దర్శనాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

image

AP: ఇవాళ 10AM నుంచి వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. మొదటి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. DEC 1 వరకు TTD వెబ్‌సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వ WhatsApp సర్వీసెస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. DEC 2న ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు టోకెన్ వివరాలు మెసేజ్ ద్వారా అందుతాయని చెప్పారు.