News April 28, 2024
చనిపోయిన అభ్యర్థిని ఓటేసి గెలిపించారు!

మరణించిన ఓ అభ్యర్థికి ఓటేసి గెలిపించిన విషయం తెలుసా? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆళ్లగడ్డ YCP అభ్యర్థి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రిటర్నింగ్ అధికారి యథావిధిగా ఎన్నికలు నిర్వహించగా.. అప్పటికే 4సార్లు MLAగా చేసిన శోభకు ప్రజలు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. అభ్యర్థి మరణిస్తే ఎన్నికల నిర్వహణ రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
<<-se>>#ELECTIONS<<>>
Similar News
News November 13, 2025
ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్

IPL: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ రూథర్ఫర్డ్ను జట్టులోకి తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. రూ.2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది. ఇతడికి 200 టీ20 మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. 3500కు పైగా రన్స్ చేశారు. భారీ సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగల సత్తా రూథర్ఫర్డ్ సొంతం.
News November 13, 2025
అల్ ఫలాహ్ వర్సిటీకి షాక్

ఉగ్ర మూలాలు బయటపడిన ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీపై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(AIU) చర్యలు తీసుకుంది. సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే లోగోను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కళాశాలకు గుర్తింపు ఉందంటూ వెబ్సైట్లో ప్రదర్శించినందుకు వర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీకి ఫండింగ్, డాక్టర్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది.
News November 13, 2025
ప్రేమ అర్థాన్ని కోల్పోయింది: అజయ్ దేవగణ్

ప్రేమ అర్థాన్ని కోల్పోయిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ అన్నారు. ‘ప్రేమ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. దాని డెప్త్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతి మెసేజ్కు హార్ట్ ఎమోజీ పెడుతున్నారు. అన్ని మెసేజ్లు లవ్తో ముగుస్తున్నాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లికి ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఉండాలని అజయ్ భార్య <<18269284>>కాజోల్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇలా చెప్పడం గమనార్హం.


