News August 13, 2024

పట్టాలు తప్పిన రైలు

image

మధ్యప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. MP నుంచి బిహార్ వెళ్తున్న రాణి కమలాపతి-సహర్సా ప్యాసింజర్ ఇటార్సీ జంక్షన్ వద్ద పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పిందని తెలిసి ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 59

image

1. అర్జునుడి శంఖం పేరేంటి?
2. రుక్మిణి సోదరుడు ఎవరు?
3. అట్ల తద్ది పండుగ ఏ మాసంలో వస్తుంది?
4. సుమంత్రుడు ఎవరి రథసారథి?
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ఏమంటారు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 7, 2025

తెలంగాణలో యాసంగికి అనువైన వరి రకాలు

image

కూనారం సన్నాలు(KNM-118), కాటన్ దొర సన్నాలు(MTU-1010), రాజేంద్రనగర్ వరి-4(RNR-29325), కూనారం వరి-2(KNM-1638), వరంగల్ వరి-2(WGL-962), కూనారం వరి-1(KNM-733), జగిత్యాల రైస్-1(JGL-24423), WGL 283, JGL 1118, BPT 2615, WGL 505, WGL 20471, JGL 18047, జగిత్యాల సాంబ, JGL 27356, RNR 21278. ఈ రకాల పంట కాలం 120-125 రోజులు. వీటిలో కొన్ని సన్న, దొడ్డు గింజ రకాలున్నాయి. వ్యవసాయ నిపుణుల సూచనలతో వీటిని నాటుకోవాలి.

News November 7, 2025

నాబార్డ్‌లో 91పోస్టులు

image

నాబార్డ్(NABARD) 91 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, PG, MBA, CA, CS, LLB, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలు రూ.150 చెల్లించాలి. వెబ్‌సైట్: www.nabard.org/