News April 11, 2025

డజను కోడిగుడ్లు రూ.536!

image

అమెరికాలో కోడిగుడ్ల ధరలు మండిపోతున్నాయి. తాజాగా డజను కోడిగుడ్ల ధర ఏకంగా రూ.536 (6.23 డాలర్లు)కు చేరింది. బర్డ్ ఫ్లూ కారణంగా దేశంలో 3 కోట్ల కోళ్లను నిర్మూలించడం, దిగుమతులూ గణనీయంగా తగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బర్డ్ ఫ్లూ ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 18, 2025

20,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు: ఇన్ఫోసిస్

image

ముందస్తు సమాచారం లేకుండా <<15595609>>400 మంది ట్రైనీలను తొలగించి<<>> విమర్శలపాలైన ఇన్ఫోసిన్ ఇప్పుడు యువతకు శుభవార్త చెప్పింది. FY2025-26లో 20K మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ వెల్లడించారు. జీతాల పెంపుపై మాట్లాడుతూ ‘కంపెనీలో జీతాల పెంపు సగటున 5-8% ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి 10-12% పెంచాం. JANలోనే చాలామందికి శాలరీలు పెరిగాయి. మిగతా వారికి APR 1 నుంచి అమల్లోకి వస్తాయి’ అని తెలిపారు.

News April 18, 2025

భార్యతో విడాకులు.. గర్ల్‌ఫ్రెండ్‌తో ధవన్(PHOTO)

image

ఆయేషా ముఖర్జీతో విడిపోయిన తర్వాత IND మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ విదేశీ యువతి సోఫీ షైన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా వీరిద్దరూ దిగిన ఫొటో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, తన ప్రియురాలు గౌరీ స్ప్రత్‌ హాజరైన ఈవెంట్‌లో ధవన్, సోఫీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా కలిసి ఫొటో దిగారు. కాగా ఈ ఐరిష్ భామతో ధవన్ ఏడాదిగా డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

News April 18, 2025

ఆ విధానం అమలుపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

image

టోల్‌గేట్లు ఎత్తేసి శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వాహన ఛార్జీ వసూలు చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మే 1నుంచే ఇది అమల్లోకి వస్తోందంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ANPR) విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంది. తొలుత ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద అమర్చుతామని పేర్కొంది.

error: Content is protected !!