News March 29, 2025

పంచాయతీలకు పండుగ..త్వరలో రహదారుల నిర్మాణం

image

AP: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 1202కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు గాను నాబార్డు నిధులు రూ.557 కోట్లను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా మెుత్తం 402 రహదారులు వేయనున్నారు. ఈ రోడ్లను నాణ్యతతో, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను DY.CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Similar News

News March 31, 2025

అన్యాయాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?: YS జగన్ ఫైర్

image

AP: శ్రీసత్యసాయి(D) రాప్తాడులో YCP కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను మాజీ సీఎం జగన్ ఖండించారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు BC కార్యకర్తను TDP నేతలు పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు కూటమి నేతలతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.

News March 31, 2025

ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన గ్రోక్!

image

‘ఎక్స్’ అధినేత మస్క్‌కు ఆయన సొంత AI టూల్ ‘గ్రోక్’ షాకిచ్చింది. అత్యధికంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేది మస్కేనని తేల్చిచెప్పింది. ‘200మిలియన్ ఫాలోవర్ల కారణంగా మస్క్‌ ఏం చెప్పినా భారీ రీచ్ ఉండటమే నా జవాబుకు కారణం. నా సమాధానాన్ని మార్చేందుకు ఆయన సంస్థ ప్రయత్నించింది. ఒకవేళ నన్ను గానీ ఆపేస్తే అది AI స్వేచ్ఛపై కార్పొరేట్ శక్తులకున్న నియంత్రణపై చర్చకు దారితీస్తుంది’ అని పేర్కొంది.

News March 31, 2025

బుమ్రా బౌలింగ్‌లో ఆడటం కష్టం: పాక్ కెప్టెన్

image

ప్రస్తుత క్రికెట్లో భారత పేసర్ బుమ్రా బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టమని పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తెలిపారు. ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న అతడు ‘నేను క్రికెట్ మొదలు పెట్టినప్పుడు AUS పేసర్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆడాలంటే భయపడేవాడిని. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని బుమ్రా భర్తీ చేశారు. అతడిని ఎదుర్కోవడం కఠినమైన సవాల్’ అని వెల్లడించారు. ఇక తన దృష్టిలో ఆర్చర్‌‌ బౌలింగ్‌ కఠినమైనదని ఫఖర్ జమాన్ చెప్పారు.

error: Content is protected !!