News November 22, 2024
సబ్మెరైన్ను ఢీకొట్టిన చేపల వేట పడవ

గోవాలో ఓ సబ్మెరైన్ను చేపల వేట సాగించే పడవ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. 11 మందిని అధికారులు రక్షించారు. ఈ ఘటన గోవాకు 70 నాటికల్ మైళ్ల దూరంలో చోటుచేసుకుంది. కాగా సబ్మెరైన్కు జరిగిన నష్టంపై నేవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై హై లెవెల్ విచారణ కొనసాగుతోంది. కాగా ఈ జలాంతర్గామి నేవీలో వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహిస్తుంది. శబ్దం లేకుండా ప్రయాణించడం దీని ప్రత్యేకత.
Similar News
News January 19, 2026
RCET అభ్యర్థులకు FEB 2 నుంచి ఇంటర్వ్యూలు

AP: Ph.D కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన RCET-2024లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇవి FEB 6 వరకు జరగనున్నాయి. ఆంధ్రా, వెంకటేశ్వర, నాగార్జున, పద్మావతి యూనివర్సిటీలు, కాకినాడ, అనంతపురం JNTUలలో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని మండలి కార్యదర్శి తిరుపతి రావు పేర్కొన్నారు.
News January 19, 2026
గడువు తీరాక వెయిటింగ్ అభ్యర్థులకు నియామక హక్కు ఉండదు: SC

చట్టబద్ధ గడువు ముగిశాక వెయిటింగ్ లిస్టు అభ్యర్థులకు నియామక హక్కు ఉండదని SC స్పష్టం చేసింది. రాజస్థాన్ PSC దాఖలు చేసిన పిటిషన్ను జస్టిసులు దీపాంకర్, అగస్టీన్ విచారించారు. నిర్ణీత వ్యవధి ముగిసినా వెయిటింగ్ లిస్టు అభ్యర్థులకు నియామకాలు ఇవ్వాలన్న ఆ రాష్ట్ర HC ఉత్తర్వులను పక్కనపెట్టారు. నాన్ జాయినింగ్ ఖాళీల్లో తమను నియమించాలని వెయిటింగ్ లిస్టు అభ్యర్థుల వ్యాజ్యంలో హైకోర్టు ఆ ఉత్తర్వులు ఇచ్చింది.
News January 19, 2026
మోదీ బయోపిక్లో హాలీవుడ్ స్టార్.. బడ్జెట్ రూ.400కోట్లు

PM మోదీ బయోపిక్ను ‘మా వందే’ అనే టైటిల్తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ పాత్రలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. క్రాంతికుమార్ డైరెక్ట్ చేస్తుండగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్పై వీర్ రెడ్డి రూ.400కోట్లతో నిర్మిస్తున్నారు. ‘ఆక్వామెన్’ ఫేమ్ జేసన్ మమోవాను ఓ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. JAN 22 నుంచి కశ్మీర్లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.


