News October 13, 2024

రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్

image

ఉత్త‌రాఖండ్‌ రూర్కీ స‌మీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఉంచిన‌ ఖాళీ గ్యాస్ సిలిండ‌ర్ క‌ల‌క‌లం రేపింది. ధంధేరా- లాండౌరా స్టేష‌న్ల మ‌ధ్య ఉద‌యం 6:35కి గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలో ట్రాక్‌పై సిలిండర్‌ను గుర్తించిన లోకోపైల‌ట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఘ‌ట‌నా స్థలానికి పాయింట్స్‌మెన్ చేరుకొని ఖాళీ సిలిండ‌ర్‌గా గుర్తించారు. ఆగ‌స్టు నుంచి దేశంలో ఇలాంటి 18 ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.

Similar News

News October 13, 2024

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏపీలో స్కూళ్లకు సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా, రేపు బడులు తెరుచుకుంటాయి. ఇక TGలో రేపు కూడా సెలవు ఉండగా, ఎల్లుండి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. అటు తెలంగాణలోని జూనియర్ కాలేజీలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి.

News October 13, 2024

త‌న పుస్త‌కంలో మోదీ గురించి రాసుకున్న బోరిస్ జాన్స‌న్

image

UK EX-PM బోరిస్ జాన్స‌న్ రాసిన ‘అన్‌లీష్డ్’ పుస్త‌కంలో PM మోదీపై ప్ర‌శంస‌లు కురిపించారు. దౌత్యపరంగా, వ్యక్తిగతంగా మోదీ నిజమైన స్నేహితులని పేర్కొన్నారు. మోదీని మార్పులు తీసుకొచ్చే వ్యక్తిగా అభివ‌ర్ణించిన బోరిస్ మొద‌టిసారి ఆయ‌న్ను క‌లిసిన‌ప్పుడు ఉత్సుక‌త‌తో కూడిన శ‌క్తిని అనుభూతి చెందానన్నారు. భార‌త్‌తో ఘ‌న‌మైన బంధాన్ని క‌లిగి ఉన్నామ‌ని, త‌న హ‌యాంలోనే స్వేచ్ఛా వాణిజ్యానికి పునాది వేశామ‌న్నారు.

News October 13, 2024

PLEASE CHECK.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు. పలువురు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కాగా, మరికొందరేమో జమ కాలేదంటున్నారు. ఈ-కేవైసీ కాకపోవడంతో పలువురి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి. క్లిక్ చేశాక రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చూడవచ్చు.