News January 29, 2025
30ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బహుమతి: సీఎం హర్షం

AP: రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్రానికి చెందిన శకటానికి తృతీయ బహుమతి రావడంపై CM చంద్రబాబు, Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై CM అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల తర్వాత RD పరేడ్లో బహుమతి వచ్చిందని చెప్పారు. మరోవైపు, హస్తకళలు చాటేలా శకటం ప్రదర్శన, బహుమతి రావడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏటికొప్పాక శకటానికి SMలో సైతం పెద్దఎత్తున మద్దతు లభించిన విషయం తెలిసిందే.
Similar News
News November 26, 2025
బెట్టింగ్లతో అప్పులు.. గన్ తాకట్టు పెట్టిన ఎస్ఐ!

TG: హైదరాబాద్ అంబర్పేట్ SI గన్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారంతోపాటు తన సర్వీస్ గన్ను SI భాను ప్రకాశ్ తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. భారీగా అప్పులు చేశారని, బెట్టింగ్లో రూ.80 లక్షలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగారం, తుపాకీ తాకట్టు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాశ్ను టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.
News November 26, 2025
BELOPలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<
News November 26, 2025
యువత చేతిలో ఊరి భవిష్యత్తు.. నిలబడతారా?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇన్నేళ్లుగా ఊరిలో ఎలాంటి మార్పు జరగలేదని నాయకుల తీరుపై నిరాశ చెందిన యువతకు ఇదే సువర్ణావకాశం. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే పట్టుదల, కొత్త ఆలోచనలున్న యువత ముందుకొచ్చి పోటీలో నిలబడాలి. మీ ప్రణాళికలతో, మాటతీరుతో ప్రజలను ఒప్పించి, వారి నమ్మకాన్ని గెలుచుకుంటే విజయం మీదే. స్వచ్ఛత, సంక్షేమం, ప్రగతితో గ్రామాలను ఆదర్శంగా మార్చుకోవచ్చు.


