News May 24, 2024

డబ్బు కోసం తల్లి లేనప్పుడు బాలిక‌కు పెళ్లి!

image

UP ప్రభుత్వం ఇచ్చే డబ్బు కోసం 8వ తరగతి బాలికకు వివాహం చేయడం ఆలస్యంగా వెలుగుచూసింది. CM సామూహిక్ వివాహ్ యోజన కింద Jan27న పిలిభిట్‌లో ‘934 వెడ్డింగ్స్’ కార్యక్రమం నిర్వహించారు. అయితే.. అప్పుడు తాను ఊర్లో లేనని, భర్త చనిపోగా అంత్యక్రియల కోసం వచ్చేసరికి విషయం తెలిసిందని బాలిక తల్లి శీతల్ దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు తన కుమార్తె వయసు దాచేందుకు సర్టిఫికెట్లను మార్ఫింగ్ చేశారన్నారు.

Similar News

News November 16, 2025

HYD: బిర్సా ముండా జయంతి సందర్భంగా ర్యాలీ

image

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సావిత్రితో కలిసి ట్యాంక్ బండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం భగవాన్ బిర్సా ముండా చూపిన ధైర్యం ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు.

News November 16, 2025

2028 నాటికి చంద్రయాన్-4 పూర్తి: నారాయణన్

image

ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 ప్రయోగాలు చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీటిలో PSLV, గగన్‌యాన్ మిషన్లతోపాటు ఓ కమర్షియల్ శాటిలైట్ ప్రయోగమూ ఉందని చెప్పారు. ‘చంద్రయాన్-4కు కేంద్రం ఆమోదం తెలిపింది. 2028 నాటికి చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావడమే దీని లక్ష్యం. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేస్తాం’ అని వివరించారు.

News November 16, 2025

ఆడపిల్లల చదువు ఆపేస్తున్నారు: కవిత

image

TG: మగ పిల్లల చదువు కోసం అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు కానీ ఆడపిల్లలను మాత్రం ఆపేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విద్యావ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఆడపిల్లల చదువు చాలా డెలికేటెడ్ సమస్యగా మారింది. బస్సు లేకపోయినా, వీధి దీపం లేకపోయినా సరే ఆడపిల్లల చదువు ఆపేస్తున్నారు. బాలికల విద్య, ఉద్యోగానికి సంబంధించి సపరేట్ విధానం అమలు చేయాలి’ అని తెలిపారు.