News October 19, 2024
రైతుల జీవితాలను మారుస్తోన్న బాలిక
వ్యవసాయం గురించి పూర్తిగా తెలియని వయసులోనూ విత్తనాలను భద్రపరుస్తున్నారు 8వ తరగతి చదివే హర్షిత ప్రియదర్శిని. ఒడిశాలోని కోరపట్లో నివసించే ఈ ‘సీడ్ గర్ల్’.. 2023లో సీడ్ బ్యాంక్ను స్టార్ట్ చేశారు. ఇందులో 180 రకాల వరి, 80 రకాల మిల్లెట్స్ను భద్రపరిచారు. ప్రతి రకాన్ని 250gms లేదా 100gms సేకరిస్తూ రైతులకు ఉచితంగా సీడ్స్ ఇస్తున్నారు. పద్మశ్రీ కమలా పూజారి నుంచి ప్రేరణ పొందినట్లు హర్షిత తెలిపారు.
Similar News
News October 20, 2024
TODAY HEADLINES
☛ గ్రూప్-1 మెయిన్స్ యథాతథం: సీఎం రేవంత్
☛ గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్ ర్యాలీ
☛ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం
☛ జనసేనలో చేరిన ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి
☛ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయి: YS జగన్
☛ INDvsNZ: సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్
☛ వయనాడ్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్
News October 20, 2024
పంత్ ఔట్ను ముందే చెప్పిన నెటిజన్!
టెస్టు మ్యాచ్లో నాలుగోరోజు రిషభ్ పంత్ 99 పరుగులకు ఔటైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఓ నెటిజన్ ముందుగానే పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంత ముందుగా, కచ్చితత్వంతో అతడెలా చెప్పాడన్నది మిస్టరీగా మారింది. నువ్వు మ్యాచ్ ఫిక్సర్వా అంటూ కొంతమంది, నా జాతకం చెప్పు బాస్ అంటూ మరికొంతమంది అతడి ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం నీవల్లే రిషభ్ ఔటయ్యారంటూ మండిపడుతున్నారు.
News October 20, 2024
కర్వా చౌత్.. రూ.22 వేల కోట్ల వ్యాపారం?
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రేపు కర్వా చౌత్ వేడుక జరుపుకోనున్నారు. గత ఏడాది ఈ పండుగకు రూ.15వేల కోట్ల మేర వ్యాపారం జరగగా, ఈసారి అది రూ.22 వేల కోట్లకు పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేశారు. ఢిల్లీలోనే రూ.4వేల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఎర్రగాజులు, సంప్రదాయ దుస్తులు, పూజాసామగ్రి, లాకెట్లు, మెట్టెలు, ఆభరణాల వంటివాటికి డిమాండ్ నెలకొందని వివరించారు.