News July 14, 2024

భారీగా పెరిగిన కందిపప్పు ధర

image

TG: రాష్ట్రంలో పప్పుల ధరలు సామాన్యులను షాక్ ఇస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో గతనెల రూ.150-160గా ఉన్న కేజీ కందిపప్పు ఇప్పుడు రూ.180-200 పలుకుతోంది. సూపర్‌ మార్కెట్లో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. మినప్పప్పు కేజీ రూ.90-120 ఉండగా ప్రస్తుతం రూ.140-160కి, పెసరపప్పు కేజీ రూ.100 నుంచి రూ.120కి చేరింది. గతేడాది వర్షాభావం వల్ల ఈసారి ఉత్పత్తి 40% తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News November 26, 2025

‘సీఎం’ వివాదాన్ని మేమే పరిష్కరిస్తాం: ఖర్గే

image

కర్ణాటకలో CM పదవి వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్, తాను కలిసి పరిష్కరిస్తామని వెల్లడించారు. కర్ణాటకలో క్షేత్రస్థాయిలో ఉన్న వారు మాత్రమే పరిస్థితిని అంచనా వేయగలరని చెప్పారు. కాగా ఈ విషయంపై రానున్న 48 గంటల్లో రాహుల్‌తో ఖర్గే భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాత సిద్దరామయ్య, DK శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

News November 26, 2025

400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

RITES 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి DEC 25వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PwBD, EWS వారికి రూ.300. వెబ్‌సైట్: https://rites.com *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 26, 2025

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ చనిపోయారా?

image

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ జైలులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ను చూసేందుకు రావల్పిండిలోని అడియాలా జైలుకు వచ్చిన ఆయన ముగ్గురు సోదరీమణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జైలు బయట PTI మద్దతుదారులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. తమ సోదరుడిని చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమపై దాడి చేశారని, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులో ఉన్నారు.