News March 24, 2025
అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట

ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని డీవోపీటీని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఇటీవల మహంతికి డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్ను ఆశ్రయించారు. అయితే స్టే విధించేందుకు క్యాట్ నిరాకరించడంతో మహంతి హైకోర్టు మెట్లెక్కారు.
Similar News
News December 21, 2025
పడుకునే ముందు ఇవి తింటే?

లవంగాన్ని రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు ఒక లవంగాన్ని తినడం లేదా నానబెట్టిన నీరు తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని అంటున్నారు. దీనిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సాయపడుతుందంటున్నారు. ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
News December 20, 2025
త్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ!

TG: కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో దేశంలోని పలు రాష్ట్రాలు మావోయిస్టు రహితంగా మారుతున్నాయి. తెలంగాణ అదే బాటలో పయనిస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది అత్యధికంగా 509 మంది మావోలు రాష్ట్రంలో లొంగిపోయారని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఇంకా పోలీసుల రికార్డుల్లో ఉన్నది 21 మంది మాత్రమేనని పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే మావో రహిత రాష్ట్రంగా ప్రకటించుకున్న మధ్యప్రదేశ్ సరసన TG చేరే అవకాశముంది.
News December 20, 2025
శ్రీశైలంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు: ఈవో

AP: శ్రీశైలం ఆలయ పరిధిలో రీల్స్, అన్యమత ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని EO శ్రీనివాసరావు హెచ్చరించారు. అనుమతి లేకుండా వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడంపై నిషేధం ఉందన్నారు. ధూమపానం, మద్యపానం, జూదం ఆడటం లాంటివి చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆలయ పవిత్రత, భక్తుల ప్రశాంతతకు భంగం కలిగించకూడదన్నారు. ఇటీవల శ్రీశైలంలో ఓ యువతి రీల్స్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.


