News August 16, 2024
మాచర్లలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ?

AP: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో 20 మంది YCP కౌన్సిలర్లు TDPలో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మున్సిపల్ ఛైర్మన్ ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావు కూడా TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారు స్థానిక MLA బ్రహ్మారెడ్డితో సమావేశమయ్యారు. రేపు వారు TDP కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా గత ఎన్నికల్లో మాచర్లలోని అన్ని వార్డులు YCP క్లీన్ స్వీప్ చేసింది.
Similar News
News November 12, 2025
టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్గా మారిన ధర్మారెడ్డి?

AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ EO ధర్మారెడ్డి అప్రూవర్గా మారినట్లు తెలుస్తోంది. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు ఆయన అంగీకరించారని సమాచారం. CBI సిట్కు ఇచ్చిన వాంగ్మూలంలో ధర్మారెడ్డి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
News November 12, 2025
విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటమార్చారు. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.
News November 12, 2025
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఉద్యోగాలు

ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<


