News October 8, 2024

వన్డే క్రికెట్‌లో కీలక మార్పు వచ్చింది ఈరోజే!

image

1987 వన్డే వరల్డ్ కప్ టోర్నీ సరిగ్గా ఇదేరోజు ఇండియా-పాకిస్థాన్‌ ఆతిథ్యంలో మొదలైంది. ఇది అక్టోబర్ 8 నుంచి నవంబర్ 8 వరకు జరిగింది. అంతకుముందు ఇంగ్లండ్‌లోనే ఈ టోర్నీలు జరిగేవి. అయితే ఈ WC వన్డే క్రికెట్‌లో కీలక మార్పును తీసుకొచ్చింది. అప్పటివరకు వన్డే మ్యాచులో 60 ఓవర్లు ఉంటుండగా దానిని 50 ఓవర్లకు తగ్గించారు. అప్పటి నుంచి ఇదే కొనసాగుతోంది. ఇక ఈ WCను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.

Similar News

News October 27, 2025

మొదటి అడుగు సులభం కాదు.. కానీ: ఆనంద్

image

ఎన్నో అడ్డంకులను అధిగమించి తవాంగ్‌కు చెందిన టెన్జియా యాంగ్కీ IPSలో చేరిన తొలి అరుణాచల్‌ప్రదేశ్‌ మహిళగా చరిత్ర సృష్టించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె ప్రయాణాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ‘మొదటి వ్యక్తి కావడం ఎప్పుడూ సులభం కాదు. ఆమె వేసిన గెలుపు బాటలో ఎంతో మంది యువతులు పయనిస్తారు’ అని కొనియాడారు. ఇది తన ‘Monday Motivation’ అని రాసుకొచ్చారు.

News October 27, 2025

పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: తిరుమల పరకామణి కేసును సీఐడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితుడు రవిపై ఏసీబీతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని, ఆయన కుటుంబ ఆస్తులను పరిశీలించి సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.

News October 27, 2025

నాగార్జున సాగర్.. CCTVల ఏర్పాటుకు అనుమతి

image

నాగార్జున సాగర్ జలాశయం కుడి వైపు(AP) CCTVల ఏర్పాటుకు TG ప్రభుత్వానికి KRMB అనుమతి ఇచ్చింది. డ్యామ్ పర్యవేక్షణకు AP భూభాగంలో CCTVల ఏర్పాటుకు TG నీటిపారుదల అధికారులు ఆంధ్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో పాటు సాగర్ కుడివైపు రిజర్వాయర్ నిర్వహణకూ ఏపీ అనుమతి ఇవ్వడం లేదనే ఫిర్యాదుపై KRMB స్పందించింది. 2014లో విభజన చట్టం తర్వాత, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ బాధ్యతను తెలంగాణ చూసుకుంటోంది.