News October 8, 2024
వన్డే క్రికెట్లో కీలక మార్పు వచ్చింది ఈరోజే!

1987 వన్డే వరల్డ్ కప్ టోర్నీ సరిగ్గా ఇదేరోజు ఇండియా-పాకిస్థాన్ ఆతిథ్యంలో మొదలైంది. ఇది అక్టోబర్ 8 నుంచి నవంబర్ 8 వరకు జరిగింది. అంతకుముందు ఇంగ్లండ్లోనే ఈ టోర్నీలు జరిగేవి. అయితే ఈ WC వన్డే క్రికెట్లో కీలక మార్పును తీసుకొచ్చింది. అప్పటివరకు వన్డే మ్యాచులో 60 ఓవర్లు ఉంటుండగా దానిని 50 ఓవర్లకు తగ్గించారు. అప్పటి నుంచి ఇదే కొనసాగుతోంది. ఇక ఈ WCను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


