News April 11, 2024

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ జీవో ఇచ్చింది. ఈ GO ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేయగా.. ఈ నెల 15న న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 7, 2025

నావల్ డాక్‌యార్డ్‌లో 320 పోస్టులు

image

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ 320 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు జనవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

News December 7, 2025

మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

image

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

News December 7, 2025

శని దోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి?

image

చేసే పనులకు అడ్డంకులు ఎదురైనా, ప్రతి విషయం ఆలస్యమైనా, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోయినా, మానసిక బాధ, నిరాశ వంటి లక్షణాలు శని దోషానికి సంకేతాలుగా భావించవచ్చు. అలాగే యవ్వనంలోనే జుట్టు రాలడం, కంటి చూపు మందగించడం, వైవాహిక జీవితంలో ప్రేమ, ఆప్యాయత లేకపోవడం, తరచూ గొడవలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. శని దోషం ఉన్నట్లు నిర్ధారించుకోవడానికి మీ జన్మ తేదీ, సమయం ఆధారంగా జ్యోతిషుడిని సంప్రదించాలి.