News April 11, 2024

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ జీవో ఇచ్చింది. ఈ GO ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేయగా.. ఈ నెల 15న న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 25, 2025

మణుగూరు: ‘కలెక్టర్ గారూ.. జర ఇటు చూడండి’

image

మణుగూరులోని చినరావిగూడెంలో ఇసుక ర్యాంపుల కోసం అడవిలోని చెట్లను కొందరు నరికేశారని, ఇసుక అక్రమ రవాణా కోసం తాత్కాలికంగా రోడ్లను నిర్మించుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. చట్టాలు ఏమయ్యాయని, పోడు రైతులకు ఒక న్యాయం, అక్రమార్కులకు ఒక న్యాయమా అని వారు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా చెట్లని తొలగిస్తున్నా జిల్లా కలెక్టర్ స్పందించరా అని అడుగుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News November 25, 2025

ప్రశాంతతను ప్రసాదించే విష్ణు నామం..

image

అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||
అమృతాన్ని ఇచ్చే చంద్రుడి నుంచి ఉద్భవించిన, దేవకీ నందనుడు అయిన కృష్ణుడి శక్తి కలిగిన, త్రిసామ అనే వేదాల సారం కలగలసిన పవిత్ర శ్లోకమిది. విష్ణు సహస్ర నామాల్లో ఒకటైన ఈ మంత్రాన్ని పఠిస్తే జ్ఞానం లభిస్తుందని నమ్మకం. మనకు తెలియకుండానే అంతర్గత శక్తి పెరిగి మనశ్శాంతి దొరుకుతుందని చెబుతారు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 25, 2025

ఏంటయ్యా రాహుల్.. ఏంటీ ఆట!

image

వెరీ టాలెంటెడ్ బ్యాటర్ అని పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్ టెస్టుల్లో దారుణంగా విఫలం అవుతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులోనూ కీలక సమయంలో చేతులెత్తేశారు. 2 ఇన్నింగ్సుల్లో కలిపి 28 రన్సే చేశారు. దీంతో టెస్టుల్లో అతడి యావరేజ్ 35.86కి పడిపోయింది. కీలక సమయాల్లో జట్టును ఆదుకోనప్పుడు ఎంత టాలెంట్ ఉండి ఏం లాభమని నెటిజన్లు మండిపడుతున్నారు. అతడిని పక్కనబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.