News November 16, 2024
స్కూళ్లపై కీలక నిర్ణయం

AP: 2025-26 నుంచి ప్రాథమికోన్నత పాఠశాల విధానాన్ని తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6, 7, 8 తరగతుల్లో 30మంది విద్యార్థుల కంటే తక్కువుంటే ప్రైమరీ, 60కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నతపాఠశాలగా మార్చనుంది. అలాగే బేసిక్, ఆదర్శ స్కూళ్లను ప్రభుత్వం నిర్వహించనుంది. బేసిక్లో 20మందిలోపు పిల్లలుంటే ఒక SGT, 60మందికి 2 SGT, ఆ పైన ప్రతి 30మందికి అదనంగా ఒక SGTని, ఆదర్శ స్కూల్లో ప్రతి తరగతికి ఓ SGTని కేటాయిస్తుంది.
Similar News
News December 25, 2025
₹1.5లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు దిశగా అడుగులు

AP: రాష్ట్రంలో ₹1.5 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మారిటైమ్ బోర్డు ద్వారా 20 MOUల్లో 14 అమల్లోకి వచ్చాయని స్పెషల్ CS కృష్ణబాబు వెల్లడించారు. ‘వీటిలో ₹10వేల CR విలువైనవి 3 ఉన్నాయి. APDC ద్వారా ₹10వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. GMR ఏరోసిటీ, మూలపేట పోర్టు, పల్నాడు, సత్యసాయి, కర్నూలు ప్రాంతాల్లో ఏరోస్పేస్ ప్రాజెక్టులు రానున్నాయి’ అని తెలిపారు.
News December 25, 2025
జైలర్ నటుడు ఆస్పత్రిపాలు

నటుడు వినాయకన్ ఆస్పత్రి పాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ఆడు-3’ షూటింగ్లో స్టంట్లు చేస్తుండగా ఆయన గాయపడ్డారు. వెంటనే కొచ్చిలోని ఆస్పత్రికి తరలించగా MRI స్కాన్లో మెడ, భుజంలోని నరాలు, కండరాలకు డ్యామేజ్ జరిగినట్లు తేలింది. దీంతో 6 వారాల పాటు బెడ్ రెస్టు తీసుకోవాలని వైద్యులు సూచించారు. జైలర్ సినిమాతో పాపులర్ అయిన ఆయన మద్యం మత్తులో <<15212135>>పలుమార్లు<<>> రచ్చ చేసిన విషయం తెలిసిందే.
News December 25, 2025
ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్, రాంచీలో ఉద్యోగాలు

<


