News March 7, 2025
ఈశాన్య భారతంలో కీలక పరిణామం.. ఏంటంటే!

ఈశాన్య భారతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మయన్మార్ జుంటా సర్కారుపై పోరాడుతున్న చిన్ స్టేట్ ప్రో డెమోక్రసీ రెబల్ గ్రూప్స్ మిజోరం CM లాల్దుహోమా సమక్షంలో ఐజ్వాల్లో విలీన ఒప్పందంపై సంతకాలు చేశాయని తెలిసింది. చిన్ల్యాండ్ కౌన్సిల్, ICNCC కలిసి సంయుక్త చిన్ జాతీయ మండలిని ఏర్పాటు చేయనున్నాయి. ఈశాన్యంలో శాంతి స్థాపనకిది కీలకం కానుంది. చిన్లో ఉండేది మిజో ప్రజలే. ఇక్కడి వాళ్లతో వారికి సంబంధాలు ఉన్నాయి.
Similar News
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<
News December 13, 2025
ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.


