News February 9, 2025

ఇక్కడ కేజీ చికెన్ రూ.150 మాత్రమే

image

TG: కామారెడ్డిలో చికెన్ చాలా చీప్‌గా లభిస్తోంది. మార్కెట్ ధర కన్నా KGపై రూ.30-40 తక్కువకే అమ్ముతారు. 5 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారుల మధ్య మొదలైన పోటీతో KG ధర రూ.150-180 మధ్యే ఉంటోంది. దీంతో చుట్టుపక్కల వారు, పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం క్వింటాళ్ల కొద్దీ చికెన్‌ను ఇక్కడే కొనుగోళ్లు చేస్తుంటారు. కొందరు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు సొంతంగా పౌల్ట్రీఫామ్‌లు ఉండటంతో తక్కువ రేటుకు అమ్మేందుకు వెనకాడటం లేదు.

Similar News

News October 18, 2025

ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెళ్లికి ముందే కౌన్సెలింగ్

image

TG: వివాహబంధాల్లో పెరుగుతున్న ఘర్షణలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 జిల్లాల్లో ఇప్పటికే ఉన్న సఖీ, వన్ స్టాప్ కేంద్రాల్లో రూ.5 కోట్ల వ్యయంతో వీటిని పెట్టనుంది. ప్రతి సెంటర్‌లో లీగల్ కౌన్సెలర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, హెల్పర్ ఉంటారు. వివాహబంధంలోకి అడుగుపెట్టాలనుకునే వారు వీటిల్లో కౌన్సెలింగ్ తీసుకోవచ్చు.

News October 18, 2025

రాయలసీమ, దక్షిణ కోస్తాకు భారీ వర్షసూచన

image

AP: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో బంగాళాఖాతం మీదుగా గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడనుందని, దీంతో రేపట్నుంచి వర్షాలు పెరిగే ఆస్కారముందని చెప్పింది.

News October 18, 2025

నిద్రమత్తులోనే ఉండండి.. టీటీడీపై HC ఆగ్రహం

image

AP: పరకామణిలో అక్రమాల వ్యవహారంపై ఇటీవల పోలీస్ శాఖపై <<17999947>>విరుచుకుపడ్డ<<>> హైకోర్టు నిన్న టీటీడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా మరికొంత కాలం నిద్రమత్తులోనే ఉండండి అంటూ మండిపడింది. కౌంటర్ ఎందుకు వేయలేదని ఈవోపై ఆగ్రహించింది. తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈనెల 27కు విచారణను వాయిదా వేసింది.