News March 17, 2024
అక్కడ లీటర్ పెట్రోల్ రూ.82 మాత్రమే

దేశంలోనే అండమాన్ & నికోబార్ ద్వీపంలో పెట్రోల్ ధరలు అత్యల్పం. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.82గా ఉంది. ఆ తర్వాత డామన్లో రూ.82, ఐజ్వాల్లో రూ.93.68, ఢిల్లీలో రూ.94గా ఉండగా.. అత్యధికంగా ఏపీలో రూ.109.87గా ఉంది. ఆ తర్వాత కేరళ(రూ.107.54), తెలంగాణ(రూ.107.39) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యధికంగా ఏపీలో లీటర్ డీజిల్ ధర రూ.97.6గా ఉండగా.. ఆ తర్వాత కేరళ రూ.96.41, తెలంగాణ రూ.95.63 ఉన్నాయి.
Similar News
News March 3, 2026
బిజినెస్ ఫ్రెండ్లీ దేశంగా భారత్

వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్న దేశంగా భారత్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇన్నోవేటర్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ 2026లో భారత్ 55.035 స్కోర్తో 54 ర్యాంక్ సాధించింది. చైనా (85) కంటే మెరుగైన స్థానంలో ఉంది. దక్షిణాసియాలోనూ మనమే టాప్. కాస్ట్ ఆఫ్ లివింగ్, మార్కెట్ సైజ్, లేబర్ చట్టాల ఆధారంగా ఈ సూచీలో ర్యాంకింగ్స్ ఇస్తారు. ఇక టాప్-3లో అమెరికా, సింగపూర్, యూకే ఉన్నాయి.
News March 3, 2026
మరో ఐదు S-400 కొనేందుకు భారత్ ప్లాన్!

డిఫెన్స్ సిస్టమ్స్ బలోపేతంలో భాగంగా భారత్ రష్యా నుంచి మరో ఐదు S-400 స్క్వాడ్రన్లు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని రక్షణ శాఖ త్వరలో ఆమోదించే అవకాశం ఉంది. S-400తో పాటు పలు మిసైళ్లను కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఆపరేషన్ సిందూర్ టైమ్లో S-400 కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2018లో ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ ఆర్డర్ చేయగా ఇప్పటికి మూడే వచ్చాయి. మరో రెండు రావాల్సింది.
News March 3, 2026
కెనడాతో భారత్ ₹24వేలకోట్ల యురేనియం డీల్

అణుశక్తి కోసం భారత్ కెనడాతో ₹24వేలకోట్ల విలువైన యురేనియం డీల్ కుదుర్చుకుంది. ఆ దేశ ప్రధాని మెక్ కార్నీ భారత్ పర్యటనలో భాగంగా నిన్న దీనిని ఖరారు చేసుకుంది. దీంతో కెనడా ఇకపై భారత్కు యురేనియమ్ను సప్లై చేయనుంది. దేశంలో ఏటా 600 టన్నుల యురేనియం ఉత్పత్తి అవుతుండగా ఇండియాకు ప్రస్తుతం 1800 టన్నులు అవసరం. 2047 నాటికి భారత్ అణుశక్తి సామర్థ్యం 100 గిగావాట్లకు చేరాలన్న లక్ష్యానికి ఈ డీల్ ఉపయోగపడుతుంది.


