News October 19, 2024
ఒక్క బాంబు బెదిరింపు కాల్తో రూ.3 కోట్ల నష్టం

బాంబు బెదిరింపు కాల్స్తో ఎయిర్లైన్స్ కంపెనీల చమురు వదులుతోంది! ఒక్కో నకిలీ కాల్ వల్ల రూ.3 కోట్ల వరకు నష్టపోతున్నట్టు అంచనా. దారి మళ్లిస్తే అదనపు ఫ్యూయల్ కోసం రూ.కోటి వరకు ఖర్చవుతోంది. ఇక ఫ్లైట్ ల్యాండింగ్, ఎయిర్పోర్ట్ పర్మిషన్లు, ప్రయాణికులకు లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, ఇతర అవసరాలకు మరో రూ.2కోట్లు కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 40 ఫేక్ కాల్స్ వల్ల కంపెనీలపై రూ.60-80కోట్ల అదనపు భారం పడింది.
Similar News
News January 10, 2026
AIIMS భోపాల్ 128 పోస్టులు.. అప్లై చేశారా?

AIIMS భోపాల్లో 128 సీనియర్ రెసిడెంట్స్ (నాన్ అకడమిక్)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.. అర్హతగల వారు JAN15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. నెలకు జీతం రూ.67,700 చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://aiimsbhopal.edu.in/
News January 10, 2026
ఈ తప్పులతో మెదడుకు ముప్పు

మనం సాధారణం అని భావించే కొన్ని అలవాట్ల వల్ల మెదడుకు ముప్పు కలుగుతుందంటున్నారు నిపుణులు. సరిపడా నిద్ర లేకపోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైం, ఎక్కువగా ఒంటరిగా ఉండటం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. ఈ అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయని హెచ్చరిస్తున్నారు.
News January 10, 2026
మూవీ మేకర్స్.. ముందే ప్లానింగ్ ఉండదా?

సినిమా నచ్చితే ఫ్యాన్స్ రెండు, మూడు సార్లు చూస్తారు. అయితే కొంత నెగటివ్ టాక్ వచ్చినా మేకర్స్ స్ట్రాటజీలు మారుస్తున్నారు. సినిమా విడుదలైన 2-3 రోజులకు మరిన్ని సీన్లు యాడ్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తాజాగా ప్రభాస్ ‘రాజాసాబ్’ విషయంలోనూ పలు కారణాలతో <<18818253>>మేకర్స్<<>> ఇదే చేస్తున్నారు. దీంతో రూ.కోట్లు ఖర్చు చేసి సినిమా తీసి ఎలా రిలీజ్ చేయాలో ముందే ప్లాన్ చేసుకోరా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.


