News December 22, 2024
రాష్ట్రంలో తప్పిన పెను రైలు ప్రమాదం

AP: విశాఖ రైల్వే స్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. TN నుంచి బెంగాల్ వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తె.జామున విశాఖ స్టేషన్కు చేరుకుంది. అక్కడ తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైనున్న విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. సిబ్బంది వెంటనే విద్యుత్ను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది విద్యుత్ను పునరుద్ధరించి రాకపోకలను తిరిగి ప్రారంభించారు.
Similar News
News December 6, 2025
ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు అనుసంధానించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్లు పెంచారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్లు ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


