News February 11, 2025
చనిపోయాడని నిర్ధారించిన వ్యక్తి మళ్లీ బతికాడు!

చచ్చి బతికాడ్రా? అని వింటుంటాం. అలాంటి ఘటనే కర్ణాటకలోని హవేరీలో జరిగింది. బిష్టప్ప అనే వ్యక్తి దీర్ఘకాలిక కాలేయ సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యం అందించినా చలనం లేకపోవడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇంటి దగ్గర అంత్యక్రియలకు ఏర్పాటు చేసి, పోస్టర్లు అంటించారు. అయితే, ఇంటికి తీసుకెళ్తుండగా శ్వాస తీసుకోవడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.
Similar News
News December 25, 2025
నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్లో పూత, పిందె రాలకుండా ఉండాలంటే..

నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్లో నత్రజని, భాస్వరంతో పాటు పొటాష్ కూడా ముఖ్యం. ఇది ఆకుల్లో తయారైన పిండిపదార్థాలు, మాంసకృత్తుల రవాణాకు అవసరమైన ఎంజైములను ఉత్తేజపరిచి పూత, పిందెరాలడాన్ని తగ్గిస్తుంది. 1% పొటాషియం నైట్రేట్ను బఠాణి గింజ పరిమాణంలో పిందెలు ఉన్న బత్తాయి చెట్టుపై పిచికారీ చేస్తే పిందె రాలడం తగ్గి, పండు పరిమాణంతో పాటు రసం శాతం, రసంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరల శాతం కూడా పెరుగుతుంది.
News December 25, 2025
HUDCOలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News December 25, 2025
PHOTOS: జగన్ క్రిస్మస్ వేడుకలు

AP: పులివెందుల పర్యటనలో ఉన్న YCP చీఫ్ జగన్ ఫ్యామిలీతో కలిసి స్థానిక CSI చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి అందరితో కలిసి కేక్ కట్ చేశారు. తల్లి విజయమ్మ ఆయనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారు. జగన్ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున చర్చ్ ప్రాంగణానికి చేరుకున్నారు. వారందరికీ జగన్ అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


