News October 7, 2024
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్లో మనిషి దంతం

ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారంలో బొద్దింక, బల్లులు, పురుగులు వచ్చిన ఘటనలు మరువకముందే ఓ వ్యక్తికి ఫుడ్లో మనిషి దంతాలు కనిపించాయి. పంజాబ్లోని ఢకోలికి చెందిన మనోజ్ అనే వ్యక్తి జొమాటోలో స్థానిక రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయగా అందులో మనిషి దంతాలు వచ్చినట్లు ఆరోపించారు. తినే ప్లేట్తోనే రెస్టారెంట్కు వెళ్లి మేనేజర్కు ఫిర్యాదు చేసి మనోజ్ గొడవ చేశారు.
Similar News
News January 22, 2026
PM తర్వాత గంభీర్దే టఫ్ జాబ్: శశి థరూర్

నాగ్పూర్లో హెడ్ కోచ్ గంభీర్ను కలిసినట్లు MP శశి థరూర్ పేర్కొన్నారు. ‘నా ఓల్డ్ ఫ్రెండ్తో మంచి డిస్కషన్ చేశాను దేశంలో PM తర్వాత గంభీర్ అత్యంత కష్టమైన ఉద్యోగం చేస్తున్నారు. రోజూ లక్షలమంది విమర్శిస్తున్నా ధైర్యంగా నడుస్తున్నారు. ఆయనకు అన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. గంభీర్ ఆయనకు థాంక్స్ చెప్పారు. పరిస్థితులు చక్కబడితే కోచ్ బాధ్యతలపై క్లారిటీ వస్తుందని ట్వీట్ చేశారు.
News January 22, 2026
EU దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు: ట్రంప్

EU దేశాలపై విధించిన టారిఫ్స్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ‘నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో భేటీ అయ్యాను. గ్రీన్లాండ్ సహా ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి ఫ్యూచర్ డీల్ ఫ్రేమ్ వర్క్ రెడీ చేశాం. దీంతో ఒక్క USకే కాదు అన్ని NATO దేశాలకు మంచి జరుగుతుంది. యూరప్ దేశాలపై టారిఫ్స్ విధించట్లేదు. గ్రీన్ల్యాండ్కు సంబంధించిన గోల్డెన్ డోమ్పై మరిన్ని చర్చలు జరుగుతాయి’ అని తెలిపారు.
News January 22, 2026
HYDలో ‘స్విస్ మాల్’ పెట్టండి: CM రేవంత్

స్విట్జర్లాండ్లోని వాడ్ కాంటన్ CM క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్డ్ను సీఎం రేవంత్ దావోస్లో కలిశారు. HYDలో ‘స్విస్ మాల్’ ఏర్పాటు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. మహిళల ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక బృందాల(SHG) పాత్రను CM వారికి వివరించారు. వాడ్ ప్రతినిధులు త్వరలో TGకు వచ్చి SHG మోడల్ను అధ్యయనం చేస్తామని తెలిపారు.


