News April 6, 2024
లోకల్ vs నాన్ లోకల్ పోస్టర్ల కలకలం

TG: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మూడు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఈ పార్లమెంట్లో తాజాగా లోకల్, నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చింది. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ‘బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కి.మీ, కాంగ్రెస్ అభ్యర్థి సునీతను కలవాలంటే 59 కి.మీ దూరం వెళ్లాలి. అదే బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిని కలవాలంటే 0 కి.మీ. పక్కా లోకల్’ అంటూ అందులో రాసుంది.
Similar News
News December 24, 2025
ఎన్టీఆర్ నుంచి బన్నీ వద్దకు త్రివిక్రమ్ ప్రాజెక్ట్?

త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ మళ్లీ అల్లు అర్జున్ వద్దకు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కుమారస్వామి కథ ఆధారంగా తెరకెక్కే ఈ మూవీలో బన్నీ హీరోగా నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. తర్వాత ఇది NTR వద్దకు చేరింది. కానీ తాజాగా మేకర్స్ ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ₹1000Crతో తీయబోయే ఈ మూవీ షూటింగ్ 2027 MARలో ప్రారంభమవుతుందని, త్వరలో అఫీషియల్ ప్రకటన వస్తుందని సమాచారం.
News December 24, 2025
షెజ్వాన్ సాస్ ఇంట్లోనే..

మార్కెట్లో దొరికే షెజ్వాన్ సాస్లో కల్తీ, రసాయనాలు కలిసే ప్రమాదం ఉంది. దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావల్సినంత పండుమిర్చి తీసుకొని 5 నిమిషాలు ఉడికించాలి. చల్లారాక కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. తర్వాత బాండీలో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, పండుమిర్చి పేస్ట్ వేయించాలి. ఉప్పు, మిరియాల పొడి, పంచదార, టమాటా కెచప్, వెనిగర్, సోయాసాస్ వేసి కాసేపు ఉడికిస్తే చాలు.
News December 24, 2025
‘అమరావతి’ బిల్లుపై నేడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం?

AP: అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇవాళ జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014-2024 మధ్య HYD ఉమ్మడి రాజధానిగా ఉంది. దీంతో 2024 జూన్ 2 నుంచి AP రాజధానిగా అమరావతిని గుర్తించాలని ప్రభుత్వం కోరుతున్న విషయం తెలిసిందే.


