News August 6, 2024
కొడుకు చనిపోయాడని తెలియని తల్లి.. విషాదంలో కుటుంబం

MS చదివేందుకు US వెళ్లిన తన కొడుకు చనిపోయాడని ఆ తల్లికి తెలియదు. తెలిస్తే బాధపడుతుందని కుటుంబసభ్యులు చెప్పలేదు. సిద్దిపేట(D) కూటిగల్కు చెందిన సాయిరోహిత్(23) గతనెల 22న రూమ్ నుంచి బయటకు వెళ్లాడు. 24న ఓ సరస్సులో శవమై తేలాడు. అతని మృతిపై అనుమానాలు ఉన్నాయి. మృతదేహం నేడు ఇంటికి చేరుకోనుంది. ₹30L అప్పుచేసి కొడుకును విదేశాలకు పంపిన పేరెంట్స్కు కన్నీళ్లే మిగిలాయని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 11, 2025
మహిళా ఐఏఎస్కు గృహ హింస వేధింపులు

సామాన్య మహిళలకే కాదు చట్టాలను రూపొందించే స్థానంలో ఉన్న ఉమెన్ బ్యూరోక్రాట్లకు గృహ హింస తప్పట్లేదు. IAS ఆఫీసర్ అయిన తనభర్త ఆశిష్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ IAS భారతి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాజస్థాన్ జైపూర్లో జరిగింది. పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆశిష్ సామాజిక న్యాయం విభాగంలో డైరెక్టర్ కాగా, భారతి ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.
News November 11, 2025
‘రాజాసాబ్’.. ప్రభాస్ సూపర్ లుక్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్గా కనిపిస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.
News November 11, 2025
ముంబై ఆ ఇద్దరిని వదిలేయాలి: హెడెన్

IPL రిటెన్షన్స్ ప్రకటనకు ముందు ముంబై ఇండియన్స్కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హెడెన్ కీలక సూచనలు చేశారు. గత వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసిన బౌల్ట్(₹12.5Cr), దీపక్ చాహర్(₹9.25Cr)ను వదిలేయాలని అభిప్రాయపడ్డారు. వీరిద్దరినీ వదిలేస్తే పర్స్ ఎక్కువగా మిగులుతుందని, టీమ్ బెంచ్ స్ట్రెంత్ను స్ట్రాంగ్ చేసుకోవచ్చన్నారు. అవసరమైతే వారిని మళ్లీ తక్కువ ధరకు మినీ వేలంలో తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


