News September 10, 2025

శ్రీనువైట్ల, నితిన్ కాంబోలో సినిమా?

image

గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలు లేని హీరో నితిన్, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ‘తమ్ముడు’తో ఫెయిల్యూర్ చూసిన నితిన్.. ప్రస్తుతం ‘బలగం’ వేణుతో ‘ఎల్లమ్మ’ మూవీ చేస్తున్నారు. అటు శ్రీనువైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

Similar News

News March 9, 2026

క్విజ్‌లో పాల్గొనండి.. రూ.25వేలు గెలుచుకోండి!

image

భారత జాతీయ గేయం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం <>MyGov<<>> వెబ్‌సైట్‌లో క్విజ్ నిర్వహిస్తోంది. లాగిన్ అయి 300 సెకన్లలో 10 ప్రశ్నలను పూర్తిచేయాలి. ప్రథమ బహుమతిగా రూ.25వేలు, రెండు, మూడు స్థానాల్లో ఉన్నవారికి ₹15వేలు, ₹10వేలు అందజేస్తారు. మరో 150 మందికి ₹3,000 చొప్పున లభిస్తాయి. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ ఇస్తారు. ఏప్రిల్ 15వరకు క్విజ్‌లో పాల్గొనవచ్చు.

News March 9, 2026

మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే ఉపేక్షించబోం: CBN

image

AP: గత ఐదేళ్లూ కల్తీ, కుంభకోణాలు చేశారని CM చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల(D) కొత్తబురుజులో మాట్లాడుతూ కల్తీ మద్యంతో వేల మంది మరణానికి వైసీపీ నేతలు కారణమయ్యారని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ కల్తీ చేసి ఆలయ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కుట్రపూరితంగా మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, వీటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

News March 9, 2026

తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా?

image

తిన్న తర్వాత బాడీ ‘డైజెషన్ మోడ్’లోకి వెళ్తుంది. రక్తం అంతా పొట్ట దగ్గరకు చేరి ఆహారాన్ని అరిగించే పనిలో ఉంటుంది. అలాంటి టైమ్‌లో వెంటనే స్నానం చేస్తే బాడీ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయడం కోసం బ్లడ్ సర్క్యులేషన్‌ను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోయి.. కడుపు ఉబ్బరం, హెవీనెస్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. అందుకే తిన్న తర్వాత 30 నుంచి 45 నిమిషాల గ్యాప్ ఇచ్చి స్నానం చేస్తే బెస్ట్.