News September 10, 2025
శ్రీనువైట్ల, నితిన్ కాంబోలో సినిమా?

గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలు లేని హీరో నితిన్, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ‘తమ్ముడు’తో ఫెయిల్యూర్ చూసిన నితిన్.. ప్రస్తుతం ‘బలగం’ వేణుతో ‘ఎల్లమ్మ’ మూవీ చేస్తున్నారు. అటు శ్రీనువైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
Similar News
News March 9, 2026
క్విజ్లో పాల్గొనండి.. రూ.25వేలు గెలుచుకోండి!

భారత జాతీయ గేయం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం <
News March 9, 2026
మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే ఉపేక్షించబోం: CBN

AP: గత ఐదేళ్లూ కల్తీ, కుంభకోణాలు చేశారని CM చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల(D) కొత్తబురుజులో మాట్లాడుతూ కల్తీ మద్యంతో వేల మంది మరణానికి వైసీపీ నేతలు కారణమయ్యారని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ కల్తీ చేసి ఆలయ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కుట్రపూరితంగా మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, వీటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News March 9, 2026
తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా?

తిన్న తర్వాత బాడీ ‘డైజెషన్ మోడ్’లోకి వెళ్తుంది. రక్తం అంతా పొట్ట దగ్గరకు చేరి ఆహారాన్ని అరిగించే పనిలో ఉంటుంది. అలాంటి టైమ్లో వెంటనే స్నానం చేస్తే బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడం కోసం బ్లడ్ సర్క్యులేషన్ను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోయి.. కడుపు ఉబ్బరం, హెవీనెస్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. అందుకే తిన్న తర్వాత 30 నుంచి 45 నిమిషాల గ్యాప్ ఇచ్చి స్నానం చేస్తే బెస్ట్.


