News August 9, 2024

ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి: పురందీశ్వరి

image

ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ను ఎంపీలు పురందీశ్వరి, దగ్గుమళ్ల ప్రసాద్ కోరారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు వినతులు సమర్పించారు. ‘తోతాపురి మామిడిని కనీస మద్దతు ధరల జాబితాలో చేర్చాలి. టన్నుకు రూ.25వేలు మద్దతు ధర ఇవ్వాలి’ అని కోరారు. ప్రధానితో చర్చించి మామిడి రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

Similar News

News January 24, 2026

ఎయిర్‌పోర్ట్‌లో అస్థిపంజరం కలకలం

image

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మానవ అస్థిపంజరం కనిపించడంతో సిబ్బంది షాక్‌కు గురయ్యారు. టెర్మినల్‌-3లో లగేజీ తనిఖీ చేస్తున్న సమయంలో ఓ బ్యాగ్‌లో కనిపించింది. వెంటనే పోలీసులు, ఎయిర్‌పోర్ట్‌ భద్రతా బృందాలు అప్రమత్తమయ్యారు. అయితే అది మెడికల్‌ విద్యార్థులు ఉపయోగించే డెమో స్కెలిటన్‌గా గుర్తించారు. ఆ బ్యాగ్‌ వైద్య విద్యార్థిది అని తేల్చారు. అయినప్పటికీ దానిని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు.

News January 24, 2026

అభిషేక్‌ కెరీర్‌లో తొలి గోల్డెన్ డక్

image

భారత యువ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ కెరీర్‌లో తొలిసారి గోల్డెన్‌ డక్ నమోదు చేసుకున్నారు. NZతో జరుగుతున్న రెండో T20లో తొలి బంతికే అవుటై అభిమానులను నిరాశపరిచారు. జాకబ్‌ డఫీ వేసిన బంతిని ఆడబోయి కాన్వేకు క్యాచ్‌ ఇచ్చారు. ఇది అభిషేక్‌కు T20Iల్లో రెండో డక్‌. 2024లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో (డెబ్యూ) తొలిసారి డకౌట్ అయ్యారు. మొత్తంగా ఐపీఎల్‌తో కలిపి టీ20ల్లో 10 సార్లు 0 పరుగులకే వెనుదిరిగారు.

News January 24, 2026

LRS దరఖాస్తు గడువు పొడిగింపు

image

AP: అనధికార లేఅవుట్ల <<18905073>>రెగ్యులరైజేషన్‌కు<<>> విధించిన గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. రూ.10వేలు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియలో ఆఫీసర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇప్పటివరకు 61,947 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. కాగా ముందస్తు షెడ్యూల్ ప్రకారం LRS దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియాల్సి ఉంది.