News August 9, 2024
ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి: పురందీశ్వరి

ఏపీ కేంద్రంగా జాతీయ మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ను ఎంపీలు పురందీశ్వరి, దగ్గుమళ్ల ప్రసాద్ కోరారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు వినతులు సమర్పించారు. ‘తోతాపురి మామిడిని కనీస మద్దతు ధరల జాబితాలో చేర్చాలి. టన్నుకు రూ.25వేలు మద్దతు ధర ఇవ్వాలి’ అని కోరారు. ప్రధానితో చర్చించి మామిడి రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
Similar News
News January 3, 2026
ఏపీలో కొత్త పోర్టు.. 2 వేల ఎకరాల్లో..

AP: తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు, మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ పోర్టు ట్రస్టు, ఏపీ మారిటైమ్ బోర్డు సహకారంతో 2వేల ఎకరాల్లో వీటిని నిర్మించనున్నారు. 2047 మారిటైమ్ అమృత్ కాల్ విజన్ కింద కేంద్రం రాష్ట్రాలకు భారీ లక్ష్యాలను నిర్దేశించింది. ప్రపంచశ్రేణి షిప్ బిల్డింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించింది.
News January 3, 2026
చైనా సైన్యాన్ని మోహరిస్తుందేమో.. జైశంకర్కు బలూచ్ నేత లేఖ

పాక్తో చైనా పొత్తు మరింత బలపడుతోందని బలూచిస్థాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్కు లేఖ రాశారు. ‘బలూచ్ డిఫెన్స్-ఫ్రీడమ్ ఫోర్సెస్ను బలోపేతం చేయకపోతే ఇక్కడ చైనా సైన్యాన్ని మోహరించే అవకాశం ఉంది. ఇది మాకు, ఇండియాకు ముప్పు’ అని పేర్కొన్నారు. భారత్, బలూచ్ మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్తో మోదీ తీసుకున్న చర్యలను ప్రశంసించారు.
News January 3, 2026
వాట్సాప్లో న్యాయ సలహాలు, సమాచారం

కేంద్ర ప్రభుత్వం ‘న్యాయ సేతు’ సేవలను వాట్సాప్లోనూ అందిస్తోంది. 7217711814 నంబర్కి HI అని మెసేజ్ చేయగానే ‘Tele-Law’ చాట్బాట్ లీగల్ హెల్ప్/ఇన్ఫర్మేషన్/అసిస్టెన్స్ ఆప్షన్లు చూపిస్తుంది. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకుని సేవలు పొందవచ్చు. ప్రజలకు లీగల్ హెల్ప్ అందించేందుకు 2024లో కేంద్రం ‘న్యాయ సేతు’ పేరిట డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాని సేవలను వాట్సాప్కు ఎక్స్టెండ్ చేసింది.


