News August 27, 2025
అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి!

అగ్రరాజ్యం అమెరికాను ఓ కొత్త వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధిని న్యూవరల్డ్ స్క్రూవార్మ్ (NWS) మియాసిస్ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ లార్వా మనిషి శరీరంలోకి చొచ్చుకెళ్లి (గాయాలైన చోటు నుంచి ప్రవేశిస్తుంది.) మాంసాన్ని తినేస్తుంది. దీంతో నొప్పి కలిగి ప్రాణాపాయం సంభవిస్తుంది. మేరీలాండ్లో తొలిసారిగా ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి వల్ల మనుషులకు ముప్పు లేదని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News August 27, 2025
ఖైరతాబాద్ మహాగణపతి ముందే మహిళ ప్రసవం

TG: వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహా గణపతి వద్ద అద్భుతం చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందిన నిండు గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్లో నిల్చున్న సమయంలో పాపకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తల్లీబిడ్డలను తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. గణనాథుడి ముందే పుట్టిన ఆ చిన్నారిది ఎంతో అదృష్టమని భక్తులు తెలిపారు.
News August 27, 2025
IPLకు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్

భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ IPLకు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘IPL ప్లేయర్గా నా ప్రయాణం ఇవాళ ముగిసింది. కానీ వివిధ లీగుల్లో గేమ్ ఎక్స్ప్లోరర్గా నా సమయం మొదలైంది. ఇంతకాలం వండర్ఫుల్ మెమొరీస్ మిగిల్చిన అన్ని ఫ్రాంచైజీలు, IPL, BCCIకి థాంక్స్. భవిష్యత్ను ఆస్వాదించేందుకు వేచి చూస్తున్నా’ అని అశ్విన్ ట్వీట్ చేశారు. కాగా ఈ ఏడాది అతడు చెన్నై సూపర్కింగ్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే.
News August 27, 2025
BIG ALERT: ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్

తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.