News July 18, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం ‘మల్టీ ఆడియో ట్రాక్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఉపయోగించి యూజర్లు ఒకే రీల్‌కు 20 వరకు ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత యాప్‌లోని వీడియో ఎడిటర్‌లో ‘Add to mix’ అనే ఆప్షన్ ఎంచుకుని కావాల్సిన ఆడియో ట్రాక్స్‌ను సెలక్ట్ చేయాలి. ఇలా క్రియేట్ చేసిన ట్రాక్‌లను ఇతరులు కూడా వాడుకోవచ్చు.

Similar News

News December 14, 2025

అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదా.. ఎంత ప్రమాదమంటే?

image

మారుతున్న జీవనశైలిలో యువత లేట్ నైట్ వరకు పడుకోవట్లేదు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అర్ధరాత్రి 12, ఒంటి గంట వరకు మేల్కొని ఉంటే ముఖ్యంగా మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, ఎమోషనల్‌గానూ వీక్ అవుతారు. BP, షుగర్, ఒబెసిటీ, ఇమ్యూనిటీ తగ్గడం, జీవితకాలం కూడా తగ్గిపోతుంది’ అని హెచ్చరిస్తున్నారు.

News December 13, 2025

అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు

image

AP: అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌ దీపిక(సత్యసాయి), ప్లేయర్ పాంగి కరుణ (అల్లూరి) ఇళ్లలో Dy.CM పవన్ కళ్యాణ్ కాంతులు నింపారు. వారికి TV, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు పంపించారు. క్రీడాకారుల కోటాలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తమ ఊరికి వెళ్లే 2 రోడ్లు ప్రయాణానికి యోగ్యంగా లేవని దీపిక చెప్పడంతో రూ.6.2 కోట్లతో రోడ్లను పవన్ <<18548703>>మంజూరు<<>> చేయడం తెలిసిందే.

News December 13, 2025

ఓటేయడానికి వెళ్తున్నారా.. జాగ్రత్త!

image

TG: రేపు పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. HYD, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు సొంతూళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు బైకులపైనే వెళ్తుండటంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రమాదం మెదక్(D) పెద్దశంకరంపేటలో జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు.