News July 6, 2024

అమరావతి-హైదరాబాద్ మధ్య కొత్త హైవే?

image

హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రస్తుతం 270.7KM పొడవైన 4 లైన్ల హైవేను 6 లైన్లకు విస్తరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇదే సమయంలో అమరావతి-HYD మధ్య దూరం తగ్గించేలా కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని AP ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది సాకారమైతే అమరావతి-HYD మధ్య 60-70KM వరకూ దూరం తగ్గుతుంది. 201-220KM పొడవైన ఈ హైవేను APలోని చందర్లపాడు, నేరేడుచర్ల, తిప్పర్తి మీదుగా నిర్మించాలని సూచించింది.

Similar News

News October 14, 2025

తిరుమల: సీఐడీ విచారణ మొదలు

image

AP: HC ఆదేశాలతో తిరుమల ఆలయంలోని పరకామణి చోరీ కేసు విచారణను CID ప్రారంభించింది. పరకామణి, ఆపై చోరీ కేసు నమోదైన తిరుమల వన్‌టౌన్ PSలో రికార్డులను చెక్ చేసింది. CID డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. 2023 MARలో 920డాలర్లు దొంగిలిస్తూ TTD ఉద్యోగి రవి పట్టుబడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై TTD పూర్తిస్థాయి దర్యాప్తు చేయలేదని పిల్ దాఖలు కాగా హైకోర్టు విచారణకు ఆదేశించింది.

News October 14, 2025

వంటింటి చిట్కాలు

image

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసే ముందు వాటిని వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* తేనెలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డు చేర్చడం వల్ల రుచి పెరుగుతుంది.
* కూరలు, గ్రేవీ మాడినట్లు గుర్తిస్తే వాటిలో వెన్న, పెరుగు కలిపితే వాసన రాకుండా ఉంటుంది.
<<-se>>#VantintiChitkalu<<>>

News October 14, 2025

1,064 కిలోల గుమ్మడికాయను పండించాడు

image

గుమ్మడికాయలు సాధారణంగా 3-5KGల బరువు ఉంటాయి. ఇంకా జాగ్రత్తగా పెంచితే 10-20KGల వరకు బరువు పెరగొచ్చు. కానీ కాలిఫోర్నియాలోని సాంట రోసాకు చెందిన బ్రాండన్ డ్వాసన్ ప్రత్యేక పద్ధతులతో 1,064 KGల గుమ్మడికాయను పండించారు. కాలిఫోర్నియాలో జరిగిన గుమ్మడికాయల ప్రదర్శన పోటీలో డ్వాసన్ విజేతగా నిలిచి 20 వేల డాలర్లు గెలుచుకున్నారు. ఇంజినీర్ అయిన డ్వాసన్ ఐదేళ్లుగా అతి పెద్ద గుమ్మడికాయలను సాగు చేస్తున్నారు.