News May 12, 2024

IOS యూజర్లకు వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్

image

IOS యూజర్లకు వాట్సాప్ ‘స్క్రీన్ షాట్ బ్లాకింగ్-ప్రొఫైల్ ఫొటో’ పేరిట కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీని వల్ల యూజర్ల ప్రొఫైల్ ఫొటోలను ఇతరులు స్క్రీన్ షాట్ తీసేందుకు వీలుండదు. దీంతో వారి పిక్చర్స్ మిస్ యూజ్ కాకుండా ఉంటాయి. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత ఏర్పడుతుందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.

Similar News

News December 15, 2025

హీరోయిన్‌ ఈషాతో తరుణ్ భాస్కర్ పెళ్లి?

image

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారినట్లు సినీ వర్గాల్లో టాక్. ఇద్దరూ వరంగల్‌కు చెందిన వారే కావడం గమనార్హం. కాగా తరుణ్‌కి ఇప్పటికే పెళ్లి కాగా, మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం.

News December 15, 2025

లంగ్స్‌కు ఇన్సూరెన్స్ ఉందా మెస్సీ?.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

image

‘గోట్ టూర్‌’లో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పర్యటించనున్నారు. అయితే ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉండటంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీకి స్వాగతం మెస్సీ. మీ ఎడమ కాలికి $900M ఇన్సూరెన్స్ ఉందని విన్నా. మరి లంగ్స్‌కు ఉందా?’ అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. మెస్సీ గోల్స్ రికార్డును ఢిల్లీ ఏక్యూఐ బ్రేక్ చేస్తుందని మరొకరు పోస్ట్ చేశారు.

News December 15, 2025

మోదీ, మెస్సీ మీటింగ్ క్యాన్సిల్!

image

ఢిల్లీలో తీవ్ర పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో మెస్సీ టూర్ ఆలస్యమైంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 2గంటలకు విమానం ల్యాండ్ అయింది. అక్కడి నుంచి హోటల్‌లో గ్రీట్ అండ్ మీట్‌లో పాల్గొని 4PMకు జైట్లీ స్టేడియానికి చేరుకుంటారు. సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో సహా కోట్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ఫ్లైట్ ఆలస్యం కారణంగా మోదీతో భేటీ క్యాన్సిల్ అయింది.