News April 5, 2024
ఐపీఎల్ మ్యాచ్ల వీక్షణలో సరికొత్త రికార్డ్

IPL-2024 సీజన్ రికార్డ్ వ్యూస్ని సొంతం చేసుకుంది. తొలి పది మ్యాచ్లను టీవీల్లో 35 కోట్ల మంది వీక్షించినట్లు బ్రాడ్కాస్టర్ డిస్నీస్టార్ వెల్లడించింది. ఇది ఇప్పటిదాకా జరిగిన అన్ని సీజన్ల కంటే అత్యధికం కాగా ఓవరాల్ వాచ్టైమ్ 8,028 కోట్ల నిమిషాలుగా ఉంది. ఇది గతేడాదికన్నా 20 శాతం ఎక్కువ. ఈ సీజన్లో RCB, చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్ను ఏకంగా 16.8 కోట్ల మంది వీక్షించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 21, 2026
అవకాడో సాగు.. మొక్కలు నాటే విధానం

వసంతకాలంలో తగినంత ఉష్ణ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవకాడో అంటుకట్టిన మొక్కలను లేదా మొగ్గ తొడిగిన మొక్కలను నాటాలి. 1x1x1 అడుగుల పొడవు, వెడల్పు, లోతు ఉండే విధంగా గుంతలను తవ్వుకొని 1 : 1 : 1 నిష్పత్తిలో మట్టి, ఇసుక మరియు పశువుల ఎరువుల మిశ్రమాన్ని నింపాలి. అనంతరం మొక్కలను నాటుకోవాలి. వరుసలలోని 2 మొక్కలకి మధ్య దూరం 15- 20 అడుగులు ఉండాలి. రెండు వరుసలకు మధ్య 20 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి.
News February 21, 2026
కర్నూలు WDCWలో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

AP: కర్నూలు మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ (WDCW)లో 13పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLM/సోషల్ వర్క్/సోషల్ సైన్స్/ సైకాలజీ, LLB, పారా మెడికల్ (డిగ్రీ/డిప్లొమా), డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18-39ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.13000-రూ.34,000 వరకు చెల్లిస్తారు. సైట్: https://kurnool.ap.gov.in./
News February 21, 2026
వసూల్ రాజా.. సుంకాలతో USకు భారీగా ఆదాయం

అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్లు విధిస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు, ఫీజుల ద్వారా 2025లో USకు ఏకంగా రూ.26 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. 2024తో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ. అయితే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ అంతిమంగా ఆ దేశ ప్రజలపైనే పడుతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్స్ విధించడం వల్ల స్థానికంగా వాటి ధరలు పెరిగి వినియోగదారులపై భారం పెరుగుతోంది.


