News October 17, 2024
మరోసారి ‘నామినేటెడ్’ పండుగ?

AP: రాష్ట్రంలో మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 23న రెండో జాబితాను సీఎం చంద్రబాబు విడుదల చేస్తారని సమాచారం. ఈ సారి మహిళా నేతలకు భారీగా పదవులు దక్కే అవకాశముంది. టీడీపీకి 60 శాతం, జనసేనకు 30, బీజేపీకి 10 శాతం చొప్పున కేటాయించనున్నట్లు సమాచారం. ఈ పదవుల కేటాయింపు ముగిసిన వెంటనే టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించనుంది.
Similar News
News January 22, 2026
వైద్య రంగంలో సరికొత్త విప్లవం..!

ఐఐటీ బాంబే & IIT మండి శాస్త్రవేత్తలు చిన్న రోబోల సహాయంతో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనిపెట్టారు. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నీటిలోకి వెళ్లి, ఒకేసారి దిశ మార్చుకుంటూ ఎలా ఈదుతాయో ఈ రోబోల ద్వారా విజయవంతంగా గుర్తించారు. జీవుల ప్రాథమిక కదలికలను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నానో రోబోలు మానవ రక్తనాళాల్లోకి వెళ్లి వ్యాధి ఉన్న చోటే మందులు అందించేలా ప్రయోగాలు చేయనున్నారు.
News January 22, 2026
IITల్లో ఆగని ఆత్మహత్యలు.. మానసిక సమస్యలే కారణమా!

దేశవ్యాప్తంగా ఉన్న IITల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. IIT కాన్పూర్లో మంగళవారం మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఇదే క్యాంపస్లో 9మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుల, భాషా వివక్ష, ఒంటరితనం, పోటీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో సూసైడ్ చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్యల నివారణ, కారణాలను తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది.
News January 22, 2026
రొయ్యల్లో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

రొయ్యల్లో వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అందుకే చెరువులోని రొయ్యల్లో కనిపించే కొన్ని లక్షణాలను రైతులు నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు ఆక్వా నిపుణులు. రొయ్యలు ఆహారం తీసుకోవడం ఆకస్మికంగా తగ్గించినా, బలహీనంగా కనిపిస్తూ నీటి ఉపరితలంపై ఎక్కువ సమయం ఈదుతున్నా, రొయ్య ఎర్రగా కనిపిస్తూ, గుల్ల వదులుగా ఉన్నా, అకస్మాత్తుగా ఎక్కువ రొయ్యల మరణాలు కనిపిస్తే ఆక్వా రైతులు వెంటనే అప్రమత్తమై నిపుణుల సూచనలు తీసుకోవాలి.


