News January 25, 2025
ఒకప్పుడు ఎండిపోయిన కొండ.. కానీ నేడు..

MPలోని ఇండోర్లో కేసర్ పర్వత్ ఒకప్పుడు పూర్తిగా బీడు వారిన ఓ కొండ ప్రాంతం. కానీ నేడు కశ్మీరీ కుంకుమ పువ్వు మొక్కలు, నేపాలీ రుద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్స్, అవకాడో, ఖర్జూరం వంటి అనేక వృక్షాలకు నెలవు. శంకర్ లాల్ గార్గ్ కృషి ఫలితమే ఆ పచ్చదనం. 2016లో ఆ కొండను కొన్న ఆయన 40వేల చెట్లను పెంచారు. పచ్చదనం చేరికతో ఇప్పుడు 30 రకాల పక్షులు, 25 రకాల సీతాకోకచిలుకలు, పలు జంతువులు ఆక్కడ ఆశ్రయం పొందుతున్నాయి.
Similar News
News February 2, 2026
ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద 2026-27 FYలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.
News February 2, 2026
173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 2, 2026
మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లివే..

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


