News January 25, 2025
ఒకప్పుడు ఎండిపోయిన కొండ.. కానీ నేడు..

MPలోని ఇండోర్లో కేసర్ పర్వత్ ఒకప్పుడు పూర్తిగా బీడు వారిన ఓ కొండ ప్రాంతం. కానీ నేడు కశ్మీరీ కుంకుమ పువ్వు మొక్కలు, నేపాలీ రుద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్స్, అవకాడో, ఖర్జూరం వంటి అనేక వృక్షాలకు నెలవు. శంకర్ లాల్ గార్గ్ కృషి ఫలితమే ఆ పచ్చదనం. 2016లో ఆ కొండను కొన్న ఆయన 40వేల చెట్లను పెంచారు. పచ్చదనం చేరికతో ఇప్పుడు 30 రకాల పక్షులు, 25 రకాల సీతాకోకచిలుకలు, పలు జంతువులు ఆక్కడ ఆశ్రయం పొందుతున్నాయి.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


