News October 21, 2024
ఓ ప్రయాణికుడి సరదా వ్యాఖ్యలతో కొచ్చి విమానాశ్రయంలో కలకలం

సరదాగా చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు చేటుచేస్తాయి. ఇటీవల విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు అధికమయ్యాయి. తాజాగా కొచ్చి నుంచి ముంబై వెళ్తున్న విజయ్ మాంధయన్ విమానం ఎక్కే ముందు సిబ్బందితో తన వద్ద బాంబు ఉందని చెప్పాడు. దీంతో అధికారులు అప్రమత్తమై అతని లగేజీని జల్లెడ పట్టారు. చివరికి అతను సరదాగా చెప్పినట్టు తేల్చారు. ఈ వ్యాఖ్యలతో విజయ్ ఇప్పుడు నెడుంబస్సేరి పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.
Similar News
News November 21, 2025
స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి.. రాజీనామా ప్రచారం?

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన నోటీసుకు MLA కడియం శ్రీహరి స్పందించారు. గడువు(23)కు ముందే ఆయన్ను కలిసి వివరణకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపై సభాపతి సానుకూలంగా స్పందించారు. మరోవైపు 2రోజుల్లో శ్రీహరి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు వేడిలోనే స్టేషన్ ఘన్పూర్లోనూ బైపోల్కు వెళ్లి BRSను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు చర్చ జరుగుతోంది.
News November 21, 2025
పెరుగుతున్న టమాటా ధరలు

దేశవ్యాప్తంగా టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. OCT 19 నుంచి NOV 19 మధ్య KG ధర సగటున ₹36 నుంచి ₹46కు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు పెళ్లిళ్ల సీజన్ కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటికే కొన్నిచోట్ల KG రేటు ₹80కి చేరింది. కాగా APలోని అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్లో నిన్న గరిష్ఠంగా KG రేటు రూ.50 పలికింది.
News November 21, 2025
లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో అధికారులు విజయవాడ ACB కోర్టుకు తీసుకొచ్చారు. కాగా కోర్టు డిసెంబర్ 5 వరకు రిమాండ్ను పొడిగించింది. ఇదే కేసులో YCP ఎంపీ మిథున్ రెడ్డి సైతం కోర్టుకు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా పడింది.


