News October 21, 2024
ఓ ప్రయాణికుడి సరదా వ్యాఖ్యలతో కొచ్చి విమానాశ్రయంలో కలకలం

సరదాగా చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు చేటుచేస్తాయి. ఇటీవల విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు అధికమయ్యాయి. తాజాగా కొచ్చి నుంచి ముంబై వెళ్తున్న విజయ్ మాంధయన్ విమానం ఎక్కే ముందు సిబ్బందితో తన వద్ద బాంబు ఉందని చెప్పాడు. దీంతో అధికారులు అప్రమత్తమై అతని లగేజీని జల్లెడ పట్టారు. చివరికి అతను సరదాగా చెప్పినట్టు తేల్చారు. ఈ వ్యాఖ్యలతో విజయ్ ఇప్పుడు నెడుంబస్సేరి పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.
Similar News
News November 21, 2025
ఖమ్మం: మధ్యాహ్న భోజన వ్యయం పెంపు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కుకింగ్ కాస్ట్’ను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ జీవో జారీ చేసింది. దీని ప్రకారం, ప్రాథమిక స్థాయి విద్యార్థికి ఖర్చు రూ.6.19 నుంచి రూ.6.78కి, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థికి రూ.11.79 నుంచి రూ.13.17కు పెరిగింది. హెచ్ఎంలు వెంటనే బిల్లులు పంపాలని ఆదేశించారు.
News November 21, 2025
సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనుగోలు చేయొచ్చు

AP: శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన బాబా స్మారక రూ.100 నాణేలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు. https://www.indiagovtmint.inలో మాత్రమే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280. నాణెంతోపాటు ఆయన జీవిత విశేషాల బుక్లెట్ కూడా అందుతుంది. ఆన్లైన్ పేమెంట్తో బుక్ చేసుకున్న నెల రోజుల్లోపు వీటిని ఇంటికి పంపుతారు.
News November 21, 2025
మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.


