News September 24, 2024
పాము కాటుతో వ్యక్తి మృతి.. గ్రామస్థులు ఆ పామును ఏం చేశారంటే

ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాకు చెందిన దిగేశ్వర్(22) అనే వ్యక్తిని కట్లపాము కాటేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. ఆ పామును పట్టుకున్న స్థానికులు మృతుడి చితిపై దాన్ని బతికుండానే తగులబెట్టారు. ఇంకెవరిని చంపుతుందోనన్న భయంతోనే ఇలా చేశామని తెలిపారు. దీనిపై అధికారులు విచారం వ్యక్తం చేశారు. పాముల గురించి, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
Similar News
News December 17, 2025
చేతిలో డబ్బు నిలవాలంటే..

ధనం వస్తూ ఖర్చు అవుతూ ఉంటే, ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క దగ్గర రోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. ప్రతి సోమవారం శ్రీసూక్తం పఠిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే, శ్రీయంత్రం, కనకధారా యంత్రం, కుబేర యంత్రం ఈ మూడింటిని పూజా మందిరంలో ఉంచి, రోజూ పూజిస్తే లక్ష్మీకటాక్షం లభించడం తథ్యం. ఇలా చేయడం ద్వారా డబ్బు నిలవక పోవడం అనే సమస్య తగ్గుతుంది.
News December 17, 2025
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News December 17, 2025
ముగిసిన పోలింగ్.. కాసేపట్లో ఫలితాలు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. చివరి విడత పోలింగ్ పూర్తయింది. 3,752 సర్పంచ్ స్థానాల్లో 12,652 మంది, 28,410 వార్డు స్థానాల్లో 75,725 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అధికారులు ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియకు తెర పడనుంది.


