News September 24, 2024

పాము కాటుతో వ్యక్తి మృతి.. గ్రామస్థులు ఆ పామును ఏం చేశారంటే

image

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన దిగేశ్వర్(22) అనే వ్యక్తిని కట్లపాము కాటేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. ఆ పామును పట్టుకున్న స్థానికులు మృతుడి చితిపై దాన్ని బతికుండానే తగులబెట్టారు. ఇంకెవరిని చంపుతుందోనన్న భయంతోనే ఇలా చేశామని తెలిపారు. దీనిపై అధికారులు విచారం వ్యక్తం చేశారు. పాముల గురించి, చికిత్స గురించి ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Similar News

News December 6, 2025

కృష్ణా: నకిలీ సిమ్‌లు.. మరో 8 మందికి సంకెళ్లు

image

వినియోగదారుల ఆధార్ వివరాలు, వేలిముద్రలతో అక్రమంగా సిమ్‌ కార్డులను యాక్టివేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు ముమ్మరం చేసి, తాజాగా మరో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉండగా, ఈ మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

News December 6, 2025

నిజమైన భక్తులు ఎవరంటే?

image

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>

News December 6, 2025

బంధం బలంగా మారాలంటే?

image

భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఎంత సమయం గడిపితే అనుబంధం అంత దృఢమవుతుందంటున్నారు నిపుణులు. వ్యక్తిగత, కెరీర్‌ విషయాల్లో ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. రోజూ కాసేపు కలిసి సమయం గడిపేలా ప్లాన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. తమ మధ్య పెరిగిన దూరానికి అసలు కారణాలేంటో, ఇద్దరి మనసుల్లో ఉన్న ఆలోచనలేంటో పంచుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. ఇద్దరూ తిరిగి కలిసిపోయేందుకు మార్గం సుగమమవుతుంది.