News September 15, 2024

నిఫా వైరస్‌తో కేరళలో వ్యక్తి మృతి

image

నిఫా వైరస్ కారణంగా కేరళలో ఓ వ్యక్తి మరణించారు. మళప్పురం జిల్లాకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆ వ్యక్తి సెప్టెంబర్ 9వ తేదీన మృతి చెందినట్లు పేర్కొన్నారు. మరణం తర్వాత పరీక్షల్లో నిఫా వైరస్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. మృతుడితో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లని గుర్తించి అనుమానిత లక్షణాలు ఉన్న ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు.

Similar News

News November 25, 2025

జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్ష

image

AP: జిల్లాల <<18381213>>పునర్విభజన<<>>, డివిజన్లు, మండలాల మార్పుచేర్పులపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. వారు ఇచ్చిన నివేదికపై సీఎం కసరత్తు చేస్తున్నారు.

News November 25, 2025

బల్మెర్ లారీలో ఉద్యోగాలు

image

<>బల్మెర్ లారీ<<>> 15 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 19వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. నెలకు రూ.40వేల నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com/

News November 25, 2025

సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.