News September 24, 2024
సీఎంపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
AP: సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లికి చెందిన బేరి తిరుపాలురెడ్డి సీఎంను అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తూ పోస్టులు పెట్టారు. స్థానిక టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 24, 2024
ఇంతకు ముందెన్నడూ చూడని ప్రో అమెరికన్ పీఎం మోదీ: US రాయబారి
నరేంద్రమోదీ, జో బైడెన్ మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ అన్నారు. 2 దేశాల్లోని ప్రజలకు వారిద్దరూ ప్రతినిధులని పేర్కొన్నారు. ‘భారత చరిత్రలోనే మోదీలాంటి ప్రో అమెరికన్ పీఎంను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఇక అమెరికా చరిత్రలో అత్యంత ప్రో ఇండియన్ ప్రెసిడెంట్ బైడెన్’ అంటూ ఆయన వర్ణించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి సమస్యల పరిష్కారానికే క్వాడ్ ఉందన్నారు.
News September 24, 2024
తిరుమలలో రూ.22 కోట్లతో FSSAI ల్యాబ్
తిరుమలలో ₹22 కోట్లతో ల్యాబ్ ఏర్పాటుకు FSSAI సిద్ధమైంది. ఇందుకోసం 12000 చదరపు అడుగుల స్థలాన్ని TTD కేటాయించింది. లడ్డూ, అన్నదానం, ఇతర అవసరాల కోసం రూ.800 కోట్లకు పైగా విలువైన పదార్థాలను TTD ఏటా కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలనకు FSSAI ల్యాబ్ ఏర్పాటు చేయాలని TTD ఇటీవల కోరింది. ఇందులో ₹5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, ₹9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, ₹6 కోట్లతో బేసిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు.
News September 24, 2024
పారిపోయి కొండల్లో దాక్కున్న విద్యార్థులు!
AP: పల్నాడు(D) వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడదూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్లగా 30 మందిని టీచర్లు వెనక్కి తెచ్చారు. మరో 37మంది కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఫుడ్ సరిగా పెట్టడం లేదని, బాత్రూంలు కడిగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పోలీసులు వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. కొందరు టీచర్ల మధ్య విభేదాలు ఉండటంతో వారు పిల్లల్ని రెచ్చగొడుతున్నారని అధికారులు తెలిపారు.