News September 30, 2024

బ్లాక్‌బస్టర్ సినిమాకు ప్రీక్వెల్ రాబోతోంది!

image

ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘12th ఫెయిల్’కు ప్రీక్వెల్ రాబోతోంది. IIFA 2024 ఈవెంట్లో చిత్రనిర్మాత విధు వినోద్ చోప్రా ఈ విషయాన్ని చెప్పారు. ‘జీరో సే షురువాత్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతున్నట్లు పేర్కొన్నారు. నటీనటుల్లో ఎలాంటి మార్పు ఉండదని, డిసెంబర్ 13న విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘12th ఫెయిల్’ చిత్రంలో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్‌లు జంటగా నటించారు.

Similar News

News September 30, 2024

అందుకే T20లకు రిటైర్మెంట్ ప్రకటించా: రోహిత్

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్-2024 గెలిచాక ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెనకున్న కారణాలను ఆయన తాజాగా వెల్లడించారు. ‘నేను 17 ఏళ్లు ఈ ఫార్మాట్‌ను ఆస్వాదించా. వరల్డ్ కప్​ గెలవడంతో ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం అనిపించింది. టీమ్ఇండియాలో గొప్ప ప్లేయర్లున్నారు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు.

News September 30, 2024

OTTలోనూ దుమ్మురేపుతోన్న ‘సరిపోదా శనివారం’

image

నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇప్పటికే థియేటర్లలో రూ.100కోట్ల+ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం ఈనెల 26 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. OTT ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ దేశవ్యాప్తంగా నంబర్ 1లో ట్రెండ్ అవుతోందని హీరో నాని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సాలిడ్ మ్యూజిక్ అందించారు.

News September 30, 2024

2 నెలల్లో మరో రూ.60,000 కోట్ల ఐపీవోలు

image

ఈ ఏడాది తొలి 9 నెలల్లో 62 కంపెనీలు రూ.64,513 కోట్లను ఐపీవోల ద్వారా సమీకరించాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో మరో రూ.60,000 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీ, NTPC గ్రీన్ ఎనర్జీ, ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వారీ ఎనర్జీస్ తదితర కంపెనీలు ఐపీవోలకు రానున్నాయి. 2021లో రూ.1.19 లక్షల కోట్లు సమీకరించగా, ఈ ఏడాది రూ.1.25 లక్షల కోట్లు దాటనుంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.