News April 17, 2024
బిగ్ బీకి అరుదైన పురస్కారం
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్కు అరుదైన గౌరవం దక్కింది. లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. ఈ విషయాన్ని మంగేష్కర్ కుటుంబం ప్రకటించింది. ఈ నెల 24 లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతిన పురస్కారాన్ని అందజేయనున్నారు. 2022 ఫిబ్రవరి 6న మరణించిన సింగర్ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ప్రారంభించారు. 2022లో ప్రధాని మోదీ, 2023లో ఆశా భోస్లే ఈ అవార్డును అందుకున్నారు.
Similar News
News October 13, 2024
PLEASE CHECK.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు. పలువురు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కాగా, మరికొందరేమో జమ కాలేదంటున్నారు. ఈ-కేవైసీ కాకపోవడంతో పలువురి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇక్కడ <
News October 13, 2024
కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోంది: హరీశ్
TG: PAC ఛైర్మన్, మండలి చీఫ్ విప్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘మండలి చీఫ్ విప్గా మహేందర్ రెడ్డిని ఎలా నియమిస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. అనర్హత పిటిషన్ ఛైర్మన్ దగ్గర పెండింగ్లో ఉంది. వేటు వేయాల్సిన ఛైర్మనే మహేందర్ను చీఫ్ విప్గా నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై సమాధానం ఇవ్వాలి. PAC ఛైర్మన్ విషయంలోనూ ఇలానే చేశారు’ అని ఆయన ధ్వజమెత్తారు.
News October 13, 2024
రాష్ట్ర పండుగగా ‘వాల్మీకి జయంతి’
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17న వాల్మీకి జయంతిని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. అనంతపురంలో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించనుంది. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది.