News April 27, 2024
T20ల్లో అరుదైన రికార్డు నమోదు

పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు T20ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాయి. వరుసగా 3 మ్యాచుల్లో ఒకే స్కోర్ 178 నమోదు చేశాయి. 5మ్యాచ్ల సిరీస్లో 3వ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ 178/4 చేసింది. 4వ T20లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 178/7 స్కోర్ కొట్టింది. ఈరోజు 5వ మ్యాచ్లో మళ్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 178/5 నమోదు చేసింది. ఈ సిరీస్లో NZ 2-1తో ముందుంది. నేటి మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉంది.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.


