News April 27, 2024
T20ల్లో అరుదైన రికార్డు నమోదు

పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు T20ల్లో అరుదైన రికార్డు నెలకొల్పాయి. వరుసగా 3 మ్యాచుల్లో ఒకే స్కోర్ 178 నమోదు చేశాయి. 5మ్యాచ్ల సిరీస్లో 3వ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ 178/4 చేసింది. 4వ T20లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 178/7 స్కోర్ కొట్టింది. ఈరోజు 5వ మ్యాచ్లో మళ్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 178/5 నమోదు చేసింది. ఈ సిరీస్లో NZ 2-1తో ముందుంది. నేటి మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉంది.
Similar News
News December 4, 2025
ఇవాళ మిస్ అయితే మళ్లీ 2042లోనే!

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ మరికొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు కనిపించే చంద్రుడు 2042 వరకు మళ్లీ ఇంత దగ్గరగా, ఇంత పెద్దగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చందమామ భూమికి అత్యంత <<18450358>>సమీప<<>> పాయింట్కు రావడం వల్ల ఇది ‘లార్జెస్ట్ మూన్’గా దర్శనమివ్వనుంది. ఈ అరుదైన ప్రకాశవంతమైన చంద్రుడిని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6.30pm తర్వాత అద్భుతంగా కనిపిస్తుంది.
News December 4, 2025
భారత్ చేరుకున్న రష్యా డిఫెన్స్ మినిస్టర్.. కాసేపట్లో పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ కాసేపట్లో భారత్కు రానున్న నేపథ్యంలో ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్తో కలిసి ఆయన భారత్-రష్యా 23వ సమ్మిట్లో పాల్గొంటారు. భారత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్తో ఆండ్రీ భేటీ అవుతారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇరుదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. అటు పుతిన్ భారత్కు చేరుకున్నాక ప్రెసిడెంట్ ముర్ము ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు.
News December 4, 2025
పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు

TG: పంచాయతీ ఎన్నికలకు SEC భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేలా పలు జిల్లాల్లో పోలీసు బలగాలు గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించి చర్యలు చేపడుతున్నారు. షాద్నగర్ పరిధిలోని పలు పంచాయతీల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు.


