News September 18, 2024

చిలుకను పట్టిస్తే రూ.10వేలు రివార్డు

image

తమ చిలుక సమాచారమిస్తే రూ.10వేలు రివార్డిస్తామంటూ అయోధ్యలో వెలిసిన పోస్టర్లు ఇంట్రెస్టింగా మారాయి. UP ఫైజాబాద్‌లోని శైలేశ్ కుమార్ ఈ ‘మిట్టూ’ చిలకను పెంచుకుంటున్నారు. 20 రోజుల క్రితం పొరపాటున పంజరం తెరవడంతో ఎగిరిపోయి ఇంటికి తిరిగి రాలేదన్నారు. తెలివైన, చక్కగా శిక్షణ పొందిన మిట్టూ మనుషుల గొంతును అనుకరించేదని, ఇంటికొచ్చిన గెస్టులను పేరుపెట్టి పిలిచేదన్నారు. దాని జాడ తెలీక వారి కుటుంబం వర్రీ అవుతోందట.

Similar News

News November 17, 2025

నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

image

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్‌ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.

News November 17, 2025

న్యూస్ రౌండప్

image

⋆ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ
⋆ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
⋆ నేడు మ.3 గంటలకు TG క్యాబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలు, అందెశ్రీ స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం
⋆ నేడు T BJP నేతల కీలక భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చ
⋆ లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో నేడు CBI విచారణకు పుట్ట మధు

News November 17, 2025

నువ్వుల పంట కోతకు వచ్చిందా?

image

తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో విత్తుకున్న నువ్వుల పంట ప్రస్తుతం కోత మరియు నూర్పిడి దశలో ఉంటుంది. పంటలో 75% కాయలు లేత పసుపు రంగులోకి వచ్చినప్పుడే పైరును కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ 8 శాతానికి తగ్గేవరకు చూసుకోవాలి. ఆ తరువాతే గోనె సంచిలో నిల్వ చేయాలి. ఈ సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి.