News January 24, 2025
క్రికెటర్ల వరుస విడాకులు.. అసలేం జరుగుతోంది!

భారత క్రికెటర్లు విడాకులు తీసుకోవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. కొందరు ప్రొఫెషనల్ కెరీర్లో సక్సెస్ అయినా కుటుంబ వ్యవహారాల్లో ఫెయిల్ అవుతున్నారు. స్పిన్నర్ చాహల్, తన భార్య ధనశ్రీ విడిపోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తన 20ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పేందుకు సిద్ధమైనట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. కాగా ధవన్, షమీ, పాండ్య ఇప్పటికే విడాకులు తీసుకున్నారు.
Similar News
News November 20, 2025
హిందీ Vs మరాఠీ వివాదం.. యువకుడు ఆత్మహత్య

హిందీ-మరాఠీ <<15354535>>వివాదం<<>> ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. MHలోని థానేకు చెందిన అర్ణవ్ ములంద్లోని కాలేజీకి వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాడు. ఈక్రమంలోనే రైలులో హిందీ-మరాఠీపై చర్చ జరిగింది. ఇది కాస్తా గొడవకు దారి తీయడంతో ఐదుగురు యువకుల గ్యాంగ్ అర్ణవ్పై దాడి చేసింది. దీంతో అతడు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అర్ణవ్ తండ్రి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
News November 20, 2025
రెండో టెస్టుకు భారత జట్టులో మార్పులివేనా?

గువాహటిలో ఎల్లుండి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు భారత జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. గిల్ స్థానంలో సాయి సుదర్శన్, పిచ్ కండిషన్ను బట్టి అక్షర్ పటేల్ ప్లేస్లో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. ఒకవేళ సాయి సుదర్శన్ను తీసుకోకపోతే దేవదత్ పడిక్కల్కు అవకాశం ఇస్తారని సమాచారం. ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి.
News November 20, 2025
₹600Crతో TG పోలీసు AMBIS అప్గ్రేడ్

TG పోలీస్ శాఖ నేర పరిశోధన వేగాన్ని పెంచేందుకు ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(AMBIS)ను అప్గ్రేడ్ చేస్తోంది. పాతబడిన సర్వర్లు, స్టోరేజ్ స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ₹600Cr మంజూరు చేసింది. ఈ వ్యవస్థ అన్ని PSలలోని పరికరాలను లింక్ చేస్తుంది. AI సాయంతో సెకన్లలోనే బయోమెట్రిక్ మ్యాచింగ్ పూర్తవుతుంది.


