News November 14, 2024
పాక్కు షాక్.. భారత్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై నీలినీడలు కమ్ముకున్న సమయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ విధానానికి అంగీకరించకపోతే ఈ టోర్నీ భారత్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ ఆడటానికి భారత్కు రాకపోతే శ్రీలంకను క్వాలిఫై చేస్తారని టాక్. ఈ విషయంపై ICC తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా CT పాక్లో జరగాల్సి ఉంది. కానీ అక్కడికి వెళ్లేందుకు ఇండియా ససేమిరా అంటోంది.
Similar News
News February 1, 2026
‘ఫార్మర్ రిజిస్ట్రీ’లో పేరు నమోదు చేసుకోకపోతే..

AP: రైతులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కేంద్రం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ 13L మంది రిజిస్టర్ చేసుకోలేదు. వీరు PM కిసాన్-అన్నదాత సుఖీభవ(ఏటా ₹20K) నిధులు పొందలేరని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ వెల్లడించారు. రైతు సేవా కేంద్రాలు లేదా APAIMS 2.0 యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ-పంట నమోదునూ రైతులే యాప్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.
News February 1, 2026
2 గంటలుగా కేసీఆర్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ సీఎం కేసీఆర్ను సిట్ రెండు గంటలుగా విచారిస్తోంది. అధికారులు ఏం ప్రశ్నలు అడిగారు? ఆయన ఏం సమాధానాలిచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కేసులో ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీలు రాధాకిషన్ రావు, తిరుపతన్న, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్లను సిట్ విచారించిన విషయం తెలిసిందే.
News February 1, 2026
పొద్దుతిరుగుడు సాగు.. విత్తన మోతాదు, విత్తనశుద్ధి

యాసంగిలో పొద్దుతిరుగుడు సాగుకు సాధారణంగా ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనం అవసరం. పంట మొదటి దశలో ఆశించే చీడపీడల నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.0 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ. కలిపి విత్తనశుద్ధి చేయాలి. సాధారణ దుక్కి పద్ధతిలో లేదా వరికోతలు తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. వరికోతలు ఆలస్యమైన ప్రాంతాల్లో ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.


