News November 14, 2024
పాక్కు షాక్.. భారత్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై నీలినీడలు కమ్ముకున్న సమయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ విధానానికి అంగీకరించకపోతే ఈ టోర్నీ భారత్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ ఆడటానికి భారత్కు రాకపోతే శ్రీలంకను క్వాలిఫై చేస్తారని టాక్. ఈ విషయంపై ICC తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా CT పాక్లో జరగాల్సి ఉంది. కానీ అక్కడికి వెళ్లేందుకు ఇండియా ససేమిరా అంటోంది.
Similar News
News January 31, 2026
నేడే పింఛన్ల పంపిణీ

AP: రాష్ట్రంలో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఈరోజే నగదు అందజేయనున్నారు. కుప్పంలో గుడుపల్లె(M) బెగ్గిలిపల్లెలో CM చంద్రబాబు నగదు పంపిణీ చేయనున్నారు. కొత్తగా మంజూరైన 7,944 వితంతు పింఛన్లతో కలిపి మొత్తం 62.94 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేస్తారు. ఇవాళ నగదు అందుకోలేకపోతే FEB 2న తీసుకోవచ్చని తెలిపింది.
News January 31, 2026
స్కూళ్లలో ‘ఆధార్’ క్యాంపులు

TG: విద్యార్థుల ఆధార్ రిజిస్ట్రేషన్, అప్డేట్ కోసం స్కూళ్లలో స్పెషల్ ఆధార్ మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ సెంటర్లు ఎప్పుడు, ఏ స్కూలులో ఉంటాయో తెలుసుకునేందుకు డీఈవో, ఎంఈవోలను సంప్రదించాలని సూచించింది. 5-15, 15-17 ఏళ్ల వయసున్న అన్ని స్కూళ్ల విద్యార్థుల ఫస్ట్ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితమని, రెండోసారి అయితే ₹125, వివరాల మార్పునకు ₹75 చెల్లించాలని అధికారులు తెలిపారు.
News January 31, 2026
శని త్రయోదశి నాడు పఠించాల్సిన శ్లోకం

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్|
ఛాయా మార్తాండ సంభూతుడు తం నమామి శనైశ్చరమ్||
నేడు ఈ శ్లోకాన్ని కనీసం 11 సార్లు పఠించడం వల్ల శని గ్రహ పీడలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ‘‘ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలంటున్నారు. ‘‘ఓం నమః శివాయ’’ పంచాక్షరీ మంత్రాన్ని జపించినా విశేష ఫలితాలుంటాయని, వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని సూచిస్తున్నారు.


