News March 22, 2024
ఎయిర్ ఇండియాకు షాక్
ఎయిర్ ఇండియాపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.80లక్షల జరిమానా విధించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్స్, సిబ్బంది నిర్వహణ అంశాల్లో నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం. సిబ్బందితో ఓవర్టైమ్ పనిచేయించడం, తగిన విశ్రాంతి ఇవ్వకపోవడం, విమానాల్లో ఇద్దరు పైలట్లూ 60ఏళ్లుపైబడిన వారే ఉండటం వంటి తప్పులను గుర్తించినట్లు DGCA తెలిపింది. కాగా ఈ జనవరిలో ఎయిర్ఇండియాకు రూ.1.10కోట్ల ఫైన్ వేసింది.
Similar News
News October 2, 2024
పండుగకు ఊరెళ్తున్నారా? జాగ్రత్త
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్త. ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టండి. లేదంటే వెంట తీసుకెళ్లండి. ఇంటిని గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి. కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తేనే చోరీలను నియంత్రించవచ్చని పోలీసులు చెబుతున్నారు.
News October 2, 2024
పేపర్ కొనుగోలుకు వాలంటీర్లకిచ్చే నగదు నిలిపివేత
AP: న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు వాలంటీర్లకు చెల్లిస్తున్న రూ.200 నగదును ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల పేపర్ కొనుగోలుకు నగదు సాయం నిలిపివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా దినపత్రిక కొనుగోలు కోసం గత ప్రభుత్వం 2022 జూన్ 29న జీవో జారీ చేసింది. సాక్షి పేపర్ కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని TDP ఆరోపించింది.
News October 2, 2024
దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం!
TG: వరంగల్లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముగ్గురు యువకులు గత నెల 15న తనను ఓయో రూమ్కు తీసుకెళ్లి, బీరు తాగించి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు తాను చదివే కాలేజీలోనే బీటెక్ చదువుతున్నారని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.