News October 17, 2024

మందుబాబులకు షాక్.. పెరగనున్న మద్యం ధరలు?

image

TG: మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ రెండేళ్లకోసారి పెంచుతోంది. ఈసారి వివిధ రకాల బ్రాండ్లపై రూ.20-150 వరకు పెంచాలని బ్రూవరీలు కోరాయి. ఈమేరకు త్వరలోనే ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మద్యం ఆదాయాన్ని ఎక్సైజ్‌ శాఖ అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలూ ధరల పెంపునకు మరో కారణంగా తెలుస్తోంది.

Similar News

News January 25, 2026

విడాకులు తీసుకున్న సీరియల్ నటులు

image

టీవీ సీరియల్ కపుల్ అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అనూష IGలో తెలియజేశారు. పరస్పర అంగీకారంతో తాము చట్టపరంగా 2025లోనే విడిపోయామని తాజా పోస్టులో పేర్కొన్నారు. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు తదితర సీరియల్స్‌లో ప్రతాప్ నటించారు. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్‌లో అనూషతో కలిసి నటించారు. ఆ సమయంలోనే లవ్‌లో పడ్డారు. 2020లోనే పెళ్లి చేసుకోగా 2023 నుంచి వేరుగా ఉంటున్నారు.

News January 25, 2026

BRSలో గెలిచా.. కాంగ్రెస్‌తో పనిచేస్తున్నా: కడియం

image

TG: ఎమ్మెల్యేల అనర్హతపై వివాదం కొనసాగుతున్న వేళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో పనిచేస్తున్నట్లు తెలిపారు. ‘ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రచారం చేస్తారని అంతా అడుగుతున్నారు. నేను కాంగ్రెస్‌కే ఓటు వేయాలని చెబుతా. రేవంత్‌ ఐదేళ్లు సీఎంగా ఉంటారు. ఆయనకు ఎమ్మెల్యేలతోపాటు ప్రజల సపోర్టు ఉంది’ అని చెప్పారు.

News January 25, 2026

కలశంపై కొబ్బరికాయను ఎందుకు పెడతారు?

image

కొబ్బరికాయ బ్రహ్మాండానికి సంకేతం. అలాగే సృష్టి అంతటా నిండి ఉన్న భగవంతుని స్వరూపంగా కొలుస్తారు. కాయపై ఉండే పొర చర్మం, పీచు మాంసం, చిప్ప ఎముకలు, లోపలి కొబ్బరి ధాతువు, నీళ్లు ప్రాణాధారం, పీచు జ్ఞానానికి, అహంకారానికి ప్రతీకలు. పసుపు రాసిన వెండి లేదా రాగి కలశంపై ఆకులు, కొబ్బరికాయను ఉంచి వస్త్రంతో అలంకరిస్తే అది పూర్ణకుంభంగా మారుతుంది. ఇది దివ్యమైన ప్రాణశక్తి నిండిన జడ శరీరానికి ప్రతీకగా నిలుస్తుంది.