News October 1, 2024

ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు?

image

AP: ప్రజలపై రూ.8,113 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల మోత పడనుంది. యూనిట్‌కు రూ.4.14 నుంచి రూ.6.19 వరకు భారం పడొచ్చని అంచనా. మూడు డిస్కంలు దాఖలుచేసిన ప్రతిపాదనలపై APERC ఈ నెల 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనుంది. 2022-23లో విద్యుత్ కొనుగోళ్లకు చేసిన ఖర్చుకు సంబంధించి ఈ ఛార్జీల వసూలుకు NOVలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అప్పుడు పలు కారణాలతో ఆగిన ప్రక్రియ ఇప్పుడు షురూ అయింది.

Similar News

News November 28, 2025

పోలీస్ శాఖలో క్రమశిక్షణ చాలా ముఖ్యం: ఎస్పీ సతీశ్ కుమార్

image

పుట్టపర్తి పోలీసు పరేడ్ మైదానంలో శుక్రవారం ఏ.ఆర్ సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ, హోంగార్డ్ సిబ్బందితో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ పరేడ్ నిర్వహించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఆ దిశగా అందరూ మెలగాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ సిబ్బంది క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం అలవర్చుకోవాలన్నారు. ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడే పోలీస్ శాఖలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

News November 28, 2025

2027 WCకు రోహిత్, కోహ్లీ.. కోచ్ ఏమన్నారంటే?

image

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డారు. పెద్ద టోర్నీల్లో వారి అనుభవం జట్టుకు కీలకమని అన్నారు. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటే కచ్చితంగా ఆడతారని తెలిపారు. కాగా గత ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ రాణించిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి SAతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.

News November 28, 2025

అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్: నారాయణ

image

AP: అమరావతిలో రైల్వేస్టేష‌న్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కోస‌మే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెంద‌దని.. అందుకే ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ క‌ట్టాల‌ని సీఎం నిర్ణ‌యించార‌న్నారు. గ‌తంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎక‌రాలు మాత్ర‌మే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎక‌రాలు ఇచ్చామని వివరించారు.