News September 11, 2024

దొంగలకు షాక్.. ఇద్దరు మృతి

image

TG: దొంగతనానికి వెళ్లిన ఇద్దరు కరెంట్ షాక్‌తో మృతి చెందిన ఘటన MBNR జిల్లా మిడ్జిల్ మండలంలో జరిగింది. బోయిన్‌పల్లిలోని సోలార్ ప్లాంట్‌లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో కంచెకు కరెంట్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి చోరీకి వచ్చిన ఇద్దరు కంచె కట్ చేసే క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News November 8, 2025

బరువు తగ్గేందుకు విపరీతంగా మందులు వాడేస్తున్నారు.. జాగ్రత్త!

image

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు చాలామంది భారతీయులు ఓ డయాబెటిస్‌ ఔషధాన్ని వాడుతున్నట్లు తేలింది. దీంతో మన దేశంలో వీటి అమ్మకాలు గత నెలలో ₹100 కోట్ల వరకూ జరిగాయి. అయితే ఈ మందులు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడానికి జీవనశైలిలో సరైన మార్పులు (పోషకాహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ) ప్రధానమని సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు వాడాలంటున్నారు.

News November 8, 2025

పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఎలాగంటే?

image

హీరో షారుఖ్ ఖాన్‌పై IND మాజీ ప్లేయర్ పుజారా భార్య పూజ ప్రశంసలు కురిపించారు. ఆమె రాసిన పుస్తకంలో షారుఖ్ తమ కుటుంబానికి చేసిన సాయాన్ని వివరించారు. ‘2008లో పుజారా మోకాలికి గాయమైంది. అప్పుడు SAలో చికిత్స చేయించేందుకు KKR యాజమాన్యం ముందుకొచ్చింది. అతనికి సాయంగా వెళ్లేందుకు పుజారా తండ్రికి పాస్‌పోర్ట్, ప్రయాణానికి షారుఖ్ సాయం చేశారు. KKR తరఫున పుజారా ఆడకపోయినా సాయం చేయడం గొప్ప విషయం’ అని గుర్తు చేశారు.

News November 8, 2025

APPLY NOW: MPMMCCలో ఉద్యోగాలు

image

వారణాసిలోని మహాత్మ పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్‌ <>10 <<>>పోస్టులను భర్తీ చేస్తోంది. పోస్టును బట్టి బీఫార్మసీ, డీఫార్మసీ, BSc, MSc, ఇంటర్, డిప్లొమా, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 27- 45ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు రెజ్యూమ్, డాక్యుమెంట్స్ recruitment@mpmmcc.tmc.gov.inకు సెండ్ చేయాలి. ఈనెల 10,11,12వ తేదీల్లో ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.