News February 8, 2025

BJPకి ఓట్ల వర్షం.. 27 ఏళ్ల కల నెరవేరిన వేళ

image

PM మోదీ ‘డబుల్ ఇంజిన్’ నినాదం పని చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలో BJP 27 ఏళ్ల కల నెరవేరింది. 1998లో BJP చివరి CMగా సుష్మాస్వరాజ్ పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఆప్‌లే దేశ రాజధానిని ఏలాయి. ఆప్ అగ్రనేతలపై అవినీతి మచ్చ, కాంగ్రెస్ ప్రభావం లేకపోవడం ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చాయి. ప్రజలకు ఉపయోగపడే పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తామని చెప్పడంతో BJPకి ఓట్ల వర్షం కురిసింది.

Similar News

News February 8, 2025

ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకం: చంద్రబాబు

image

AP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారని చెప్పారు. ‘ఢిల్లీలో రాజకీయ, వాయుకాలుష్యాన్ని ఆప్ సర్కార్ పట్టించుకోలేదు. చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ సమస్య నుంచి బీజేపీ గట్టెక్కిస్తుందని ప్రజలు నమ్మారు. భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ’ అని ఆయన పేర్కొన్నారు.

News February 8, 2025

లా సెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

image

TG: లా సెట్, ఈసెట్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25న నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు ఈసెట్, మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు లాసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 12న ఈసెట్, జూన్ 6న లాసెట్ పరీక్ష జరగనుంది.

News February 8, 2025

కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి: కొండా సురేఖ

image

TG: BRS MLC కల్వకుంట్ల కవితతో కలిసి కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేయడం వల్లే ఆప్ ఎన్నికల్లో ఓడిపోయిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. BRS పార్టీ ఎక్కడికెళ్లినా భస్మాసుర హస్తమేనని ఢిల్లీ ఎన్నికలతో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్ గాంధీపై KTR వ్యాఖ్యలు అహంపూరితం. ఈ అహంకారాన్నిఅణచివేసేందుకే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు’ అని ఆమె ఫైర్ అయ్యారు.

error: Content is protected !!